పార్టీ కోసం ఏం చేయడానికైనా రెడీ

పార్టీ కోసం ఏం చేయడానికైనా రెడీ

న్యూఢిల్లీ: పార్టీ అవసరాల కోసం ఏం చేయడానికైనా సిద్ధమని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ నాయకత్వంపై అసహనం వ్యక్తం చేసిన నేతలతో శనివారం నిర్వహించిన మీటింగ్‌‌లో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. రాహుల్ కామెంట్స్‌‌కు పార్టీ నేతలలోపాటు రెబల్స్ కూడా హర్షం వ్యక్తం చేశారని సమాచారం. కొత్త ఏడాదిలో కాంగ్రెస్ పార్టీకి నూతన చీఫ్‌‌ను ఎన్నుకోనున్న నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలు ఆసక్తిని సంతరించుకున్నాయి. రెబల్స్‌‌తో సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకలు 5 గంటలపాటు సమావేశమయ్యారు. ఈ మీటింగ్‌‌‌లో రాహుల్ మాట్లాడుతూ.. ‘పార్టీ కోసం మీరు కోరుకున్న విధంగా పని చేయడానికి నేను రెడీగా ఉన్నా. కాంగ్రెస్‌‌ను బూత్ లెవల్ నుంచి బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. అందుకు నేతల మధ్య మంచి సమన్వయం ఉండాలి’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌‌లో మెజారీటీ నేతలు నూతన చీఫ్‌‌గా రాహుల్ వైపే మొగ్గు చూపుతున్నారని సమాచారం.