కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా భారత్ జోడో న్యాయ్ యాత్రకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘‘దేశం చాలా దుర్భర పరిస్థిల్లో ఉంది. సంపన్నులు మరింత సంపన్నులుగా అవుతున్నారు. కానీ పేదవారికి మాత్రం కనీసం తమ హక్కులు కూడా వారికి దక్కడం లేదు. సంపన్నులకు కోట్లాది రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు. పేద ప్రజలకు మాత్రం ఆత్మహత్యలే వారి వాటాగా వస్తున్నాయి. ఇకపై ఇది సాగదు.. ఈ అన్యాయపు శకాన్ని మార్చడానికి ప్రారంభమవుతుంది.. ఇది రాహుల్ గాంధీ రెండో సారి చేపడుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా వైరల్ అవుతున్న వీడియోల ఇలా సారాంశం.
దేశం చాలా దుర్బర పరిస్థితిలో ఉంది.
— Telangana Congress (@INCTelangana) January 10, 2024
సంపన్నులు మరింత సంపన్నులు అవుతున్నారు. కానీ పేదవారికి మాత్రం కనీసం తమ హక్కులు కూడా వారికి దక్కడం లేదు.
సంపన్నులకు కోట్లాది రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు. పేద ప్రజలకు మాత్రం ఆత్మహత్యలే వారి వాటాగా వస్తున్నాయి.
కానీ ఇకపై ఇది సాగదు.
ఈ అన్యాయపు… pic.twitter.com/xmr97vndPX
అన్యాయంపై న్యాయ పోరాటంతో మళ్లీ వస్తున్నాం..నియంతృత్వానికి, దురహంకారానికి తగిన సమాధానం ఇవ్వాలని కోట్లాది మంది దేశ ప్రజల ప్రేమ, ప్రార్థనలను తీసుకెళ్తున్నాం..
మీ హక్కుల కోసం మీ గళాన్ని పెంచండి,.ఈ న్యాయ యాత్రలో మాతో చేరండి..ఈ న్యాయ ప్రయాణం కొనసాగుతుంది.. మనకు న్యాయం జరిగే వరకు కొనసాగుతూనే ఉంటుంది.. అంటూ ఓ పక్క దేశంలో పరిస్థితిని వివరించే వీడియో క్లిప్ లతో, రాహుల్ పాదయాత్ర సంబంధించిన వీడియోలను షేర్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అన్యాయంపై న్యాయ పోరాటంతో మళ్లీ వస్తున్నాం.
— Telangana Congress (@INCTelangana) January 6, 2024
నియంతృత్వానికి, దురహంకారానికి తగిన సమాధానం ఇవ్వాలని కోట్లాది మంది దేశ ప్రజల ప్రేమ, ప్రార్థనలను తీసుకెళ్తున్నాం.
మీ హక్కుల కోసం మీ గళాన్ని పెంచండి,
ఈ న్యాయ యాత్రలో మాతో చేరండి.
ఈ న్యాయ ప్రయాణం కొనసాగుతుంది, మనకు న్యాయం జరిగే వరకు… pic.twitter.com/rgWAzG3HS5