ఇటీవల హత్యకు గురైన ప్రముఖ పంజాబీ సింగర్ సిద్దూ మూసేవాలా కుటుంబాన్ని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పరామర్శించారు. పంజాబ్ లోని మాన్సా జిల్లా మూసా గ్రామాన్ని సందర్శించిన రాహుల్... సిద్ధూకు నివాళులర్పించారు. ఈ ఉదయం చండీగఢ్ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ గాంధీ.. నేరుగా మూసేవాలా స్వగ్రామం మూసాకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆ గ్రామంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
మే 29న పంజాబ్లోని మాన్సా జిల్లాలోని జవహర్కే గ్రామంలో సిద్ధూ మూసే వాలాను దుండగులు కాల్చి చంపారు. ఈ కేసుపై దర్యాప్తును వేగవంతం చేసేందుకు పంజాబ్ పోలీసులు ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. పంజాబ్ పోలీసులు సిద్ధూ భద్రతను ఉపసంహరించుకున్న మరుసటి రోజే ఈ సంఘటన జరగడం పలు సందేహాలకు తావిస్తోంది. గాయకుడి మృతి అతని అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కొన్ని రోజుల క్రితం బీజేపీ, కాంగ్రెస్ లు కూడా పలు ప్రాంతాల్లో నిరసన చేపట్టారు.
#WATCH | Punjab: Congress leader Rahul Gandhi arrives at the residence of late singer and party leader Sidhu Moose Wala at his village Moosa in Mansa. pic.twitter.com/TpXDopNVHC
— ANI (@ANI) June 7, 2022
#WATCH | Punjab: Congress leader Rahul Gandhi met the family of late singer and party leader Sidhu Moose Wala at their residence in Moosa village, Mansa today.
— ANI (@ANI) June 7, 2022
(Source: Congress) pic.twitter.com/El9bQmI3pB