సింగర్ సిద్ధూ కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్

సింగర్ సిద్ధూ కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్

ఇటీవల హత్యకు గురైన ప్రముఖ పంజాబీ సింగర్ సిద్దూ మూసేవాలా కుటుంబాన్ని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పరామర్శించారు. పంజాబ్ లోని మాన్సా జిల్లా మూసా గ్రామాన్ని సందర్శించిన రాహుల్... సిద్ధూకు నివాళులర్పించారు. ఈ ఉదయం చండీగఢ్ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ గాంధీ.. నేరుగా మూసేవాలా స్వగ్రామం మూసాకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆ గ్రామంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

మే 29న పంజాబ్‌లోని మాన్సా జిల్లాలోని జవహర్కే గ్రామంలో సిద్ధూ మూసే వాలాను దుండగులు కాల్చి చంపారు. ఈ కేసుపై దర్యాప్తును వేగవంతం చేసేందుకు పంజాబ్ పోలీసులు ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేశారు. పంజాబ్ పోలీసులు సిద్ధూ భద్రతను ఉపసంహరించుకున్న మరుసటి రోజే ఈ సంఘటన జరగడం పలు సందేహాలకు తావిస్తోంది. గాయకుడి మృతి అతని అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కొన్ని రోజుల క్రితం బీజేపీ, కాంగ్రెస్ లు కూడా పలు ప్రాంతాల్లో నిరసన చేపట్టారు.