న్యూఢిల్లీ: కేంద్రం తాజాగా విడుదల చేసిన బడ్జెట్ పై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ చాలా నిరాశపరిచిందన్నారు. ఇందులో ఖచ్చితంగా ఏమీ లేదని తెలుస్తుందన్నారు. ఈ బడ్జెట్ లో వేతన జీవులు, పేద, మధ్యతరగతి ప్రజలకు కేటాయించిందేమీ లేదన్నారు. అణగారిన వర్గాలు, యువత, రైతులు, ఎంఎస్ఎంఈలకూ ఈ బడ్జెట్ వల్ల ఒరిగిందేమీ లేదన్నారు.
M0di G0vernment’s Zer0 Sum Budget!
— Rahul Gandhi (@RahulGandhi) February 1, 2022
Nothing for
- Salaried class
- Middle class
- The poor & deprived
- Youth
- Farmers
- MSMEs
కాగా, కేంద్ర బడ్జెట్ పై పలువురు కాంగ్రెస్ నేతలు విమర్శలకు దిగుతున్నారు. ఈ బడ్జెట్ ‘అచ్ఛే దిన్’ అనే ఎండమావిని మరింత దూరం చేసేలా కనిపిస్తోందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కామెంట్ చేశారు. 'అచ్ఛే దిన్' రావడానికి మనం మరో 25 సంవత్సరాలు వేచి ఉండాలని ఎద్దేవా చేశారు. డిజిటల్ కరెన్సీకి సంబంధించినంత వరకు, ప్రభుత్వం ఆ దిశగానే వెళ్తోందని చాలా స్పష్టంగా అర్థం అవుతోందన్నారు. బడ్జెట్లో సాధారణ పౌరులకు పదార్ధాల కొరత గురించి తాము మరింత ఆందోళన చెందుతున్నామని థరూర్ ట్వీట్ చేశారు. కేంద్రమంత్రి ప్రసంగం విన్నప్పుడు, MGNREG, రక్షణతోపాటు ప్రజలు ఎదుర్కొంటున్న ఇతర అత్యవసర ప్రాధాన్యతల గురించి ప్రస్తావించలేదన్నారు. ప్రస్తుతం మనం భయంకరమైన ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు.
Extremely disappointing, a damp squib! There seems to be absolutely nothing in this Budget. It's an astonishingly disappointing Budget. When you listen to the speech, no mention of MGNREGA, of Defence, of any other urgent priorities facing the public: Congress MP Shashi Tharoor pic.twitter.com/9g2cg6nz0T
— ANI (@ANI) February 1, 2022
మరిన్ని వార్తల కోసం: