
న్యూఢిల్లీ: ‘ఓట్ చోరీ’పై ప్రజా ఉద్యమానికి కాంగ్రెస్అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ సిద్ధమయ్యారు. బిహార్నుంచి ఈ పోరాటాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఇండియా కూటమి నేతలతో కలిసి దీన్ని చేపట్టనున్నారు. ‘‘ఓట్ చోరీకి వ్యతిరేకంగా ప్రత్యక్ష పోరాటం చేయాలని నిర్ణయించాం. బిహార్ నుంచి దీన్ని చేపడ్తాం. దేశమంతా క్లీన్ఓటర్ లిస్టు కోసమే మా ఉద్యమం. వన్మ్యాన్.. వన్ఓట్మా నినాదం” అని గురువారం ఎక్స్లో రాహుల్గాంధీ ట్వీట్ చేశారు. ఓట్ చోరీపై ఉద్యమం ఎన్నికల ఇష్యూ మాత్రమే కాదని, ప్రజాస్వామ్య రక్షణ కోసమని తెలిపారు.
ఈ నెల 17 నుంచి బిహార్లో ‘‘ఓటర్ అధికార్ యాత్ర’’తో ప్రజా ఉద్యమం ప్రారంభిస్తామని, సెప్టెంబర్ 1 వరకు ఇది కొనసాగుతుందని వెల్లడించారు. ‘‘బిహార్ యువతకు ఇదే నా విన్నపం. ఓట్ల దొంగల పనిపడ్దాం.. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. ఈ ప్రజాపోరులోకి మీ అందరికీ ఇదే నా ఆహ్వానం. యువత, కార్మికులు, రైతులు, ప్రతి ఒక్క పౌరుడు కలిసి వస్తారని ఆశిస్తున్నా” అని ట్వీట్లో ఆయన పేర్కొన్నారు. గతంలో భారత్ జోడో యాత్ర సందర్భంగా తాను బిహార్లో పర్యటించినప్పటి జ్ఞాపకాలను ప్రస్తావిస్తూ ఓ వీడియోను కూడా ఆయన పోస్ట్చేశారు.
సాసారాం నుంచి యాత్ర మొదలు
బిహార్లో రాహుల్గాంధీ చేపట్టబోయే ‘‘ఓటర్ అధికార్ యాత్ర’’ షెడ్యూల్ను కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ (సంస్థాగత) కేసీ వేణుగోపాల్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. యాత్రలో రాహుల్గాంధీతోపాటు బిహార్లోని మహాఘట్ బంధన్ పార్టీలు కూడా కలిసి వస్తాయని తెలిపారు. ఆర్జేడీ లీడర్ తేజస్వీ యాదవ్ వంటి వారు యాత్రలో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 17న సాసారాంలో యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు.
గయా, ముంగేర్, భగల్పూర్, కతిహార్, పూర్ణియా, మధుబనీ, దర్భంగా, పశ్చిమ చంపారన్, ఆరా ప్రాంతాల్లో యాత్ర కొనసాగుతుందని కేసీ వేణుగోపాల్ వివరించారు. సెప్టెంబర్ 1న పాట్నాలోని గాంధీ మైదాన్లో భారీ బహిరంగ సభతో యాత్ర ముగుస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే ఓట్ చోరీపై దేశవ్యాప్తంగా నిరసనలకు ఏఐసీసీ పిలుపునిచ్చింది. ‘ఓట్ చోర్.. గద్దీ ఛోడ్’ పేరిట అక్టోబర్ 15 వరకు వివిధ రూపాల్లో నిరసనలకు షెడ్యూల్ ప్రకటించింది. అందులో భాగంగా గురువారం రాత్రి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు క్యాండిల్ ర్యాలీలు చేపట్టారు.