యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న రైల్వే జీఎం

 యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న రైల్వే జీఎం

తెలంగాణ ప్రసిద్ధ పుణ్య క్షేత్రం యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని సౌత్​ సెంట్రల్​ రైల్వే జీఎం అరుణ్​కుమార్​ జైన్​ జులై 20 దర్శించుకున్నారు.  ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. స్వామి దర్శనానంతరం సుదర్శన నరసింహ హోమంలో పాల్గొన్నారు. ఆయనతో పాటు హోమంలో డివిజనల్​ మేనేజర్​ ఏకే గుప్తా తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా యాదాద్రి (రాయగిరి) రైల్వే స్టేషన్​లో ప్రతి రైలు ఆగే విధంగా చర్యలు తీసుకుంటానని  అరుణ్​ తెలిపారు. అనంతరం ఆయనకు వేద ఆశీర్వచనం అందించిన పూజారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. యాదాద్రిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.