రైలు జనరల్ టికెట్ ఇక ఆన్ లైన్లోనే.. ఇలా బుక్ చేసుకోవచ్చు

 రైలు జనరల్ టికెట్ ఇక ఆన్ లైన్లోనే.. ఇలా బుక్ చేసుకోవచ్చు

రైల్వే ప్రయాణికులకు శుభవార్త. జనరల్ టికెట్ల కోసం ఇకపై లైన్లలో ప్రయాణికులు బారులు తీరాల్సిన అవసరం లేదు. అన్ రిజర్వ్డ్ టికెట్లు  అంటే జనరల్ టికెట్లను కొనుగోలు చేయడానికి దక్షిణ మధ్య రైల్వే కొత్త మొబైల్ యాప్ ను ప్రవేశ పెట్టింది. UTS అంటే అన్ రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది.  

దక్షిణ మధ్య రైల్వే 2023-24 ఆర్థిక సంవత్సరంలో  సెప్టెంబర్ నెల వరకు అన్ రిజర్వ్డ్  టికెట్ బుకింగ్ సిస్టమ్ (UTS) మొబైల్ యాప్ ద్వారా 14.8% జనరల్  టిక్కెట్ల విక్రయాల రికార్డును సాధించింది. ఈ యాప్ ద్వారా రోజు రోజుకు టికెట్లు కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ యూటీఎస్ యాప్ ద్వారా   జనరల్ టికెట్లు, ఫ్లాట్ ఫారమ్ టికెట్లు, సీజన్ టికెట్లు కొనుగోలుకు దక్షిణ మధ్య రైల్వే అవకాశం కల్పించింది. 

ఎలా బుక్ చేయాలంటే..

  • స్మార్ట్ ఫోన్ ను కలిగిన ఉన్న ప్రయాణికులు..గూగుల్ ప్లే స్టో్ర్ నుంచి UTS యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. 
  • పేరు, ఫోన్ నెంబర్, పాస్ వర్డ్ వంటి వివరాలను నమోదు చేయాలి. 
  • రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు ఓటీపీ (OTP) వస్తుంది. ఈ ఓటీపీ ఎంటర్ చేస్తే యూటీఎస్ యాప్ లో మన అకౌంట్ రిజిస్టర్ అవుతుంది. 
  • యాప్ ఓపెన్ చేసి ఫోన్ నెంబర్, పాస్ వర్డ్ తో లాగిన్ కావాలి. 
  • యాప్ లో జనరల్ టికెట్లు, సీజన్ టికెట్లు, ఫ్లాట్ ఫారమ్ టికెట్ల కేటగిరీలు కనిపిస్తాయి. 
  • నార్మల్ బుకింగ్ ఆప్షన్ లో జనరల్ టికెట్ ను కొనుగోలు చేయాలి.
  • ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తున్నాం..ఎంత మంది ఉన్నారు..చిన్నారులు, పెద్దలు ఎంత మంది వంటి వివరాలు పొందు పర్చాలి. 
  • క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డిజిటల్ పేమెంట్స్ ద్వారా టికెట్లను కొనుగోలు చేయొచ్చు. 
  • షో టికెట్ ఆప్షన్ ను క్లిక్ చేస్తే..బుకింగ్ వివరాలన్నీ కనిపిస్తాయి. దాన్ని డౌన్ లోడ్ చేసుకుని..జర్నీలో టీసీలకు ఈ టికెట్ ను చూపించాల్సి ఉంటుంది. 
  • ఏ రోజు అయితే ప్రయాణం చేయాలనుకుంటున్నామో..ఆ రోజే జనరల్ టికెట్ ను కొనుగోలు చేయాలి. 

ALSO READ : వావ్...బతుకమ్మ పేర్చిన మంత్రి జగదీష్ రెడ్డి