వావ్...బతుకమ్మ పేర్చిన మంత్రి జగదీష్ రెడ్డి

వావ్...బతుకమ్మ పేర్చిన మంత్రి జగదీష్ రెడ్డి

మంత్రి జగదీష్ రెడ్డి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ పేర్చారు. అటు ఆడవాళ్లు..ఇటు ఆడవాళ్లు కూర్చోని ఉండగా..మధ్యలో కూర్చున్న మంత్రి జగదీష్ రెడ్డి.. బతుకమ్మను పేర్చారు. మహిళలు ఒక్కో పువ్వు అందిస్తుండగా..అందంగా..పువ్వులను వరుసలో పేర్చి..బతుకమ్మను తయారు చేశారు. 

ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా సూర్యాపేటలోని తన నివాసంలో సతీమణి సునీత, ఇతర మహిళలతో కలిసి మంత్రి జగదీష్ రెడ్డి బతుకమ్మ పేర్చారు. అనంతరం వారితో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలు బతుకమ్మ ఆడుతుండగా..వారి మధ్యలో మంత్రి జగదీష్ రెడ్డి నిల్చున్నారు. ఆయన్ను కూడా చప్పట్లు కొట్టాలని మహిళలు రిక్వెస్ట్ చేయగా..సున్నితంగా తిరస్కరించారు. 

ALSO READ : ఉప్పల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్ .. రేవంత్ అనుచరులు రాజీనామా