భారత ముస్లింలు తమ బలాన్ని ఎవరికి చూపిస్తున్నరు: రాజ్ ఠాక్రే

భారత ముస్లింలు తమ బలాన్ని ఎవరికి చూపిస్తున్నరు: రాజ్ ఠాక్రే

దేశంలోకి అక్రమంగా చొరబడ్డ పాకిస్తాన్, బంగ్లాదేశ్ వలసదారులను వెనక్కి పంపించాలన్నారు మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన చీఫ్ (MNS) రాజ్ ఠాక్రే. సీఏఏ కు మద్దతుగా ఆదివారం ముంబైలో ర్యాలీ నిర్వహించారు ఠాక్రే. సభలో మాట్లాడిన రాజ్ ఠాక్రే . దేశంలో అక్రమంగా చొరబడ్డ వలసదారులను వెంటనే పంపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. భారతదేశ ముస్లింలకు సీఏఏ వ్యతిరేకం కాదని అన్నారు. అసలు దేశంలో పుట్టిన ముస్లింలకు సీఏఏ ఎలా వ్యతిరేకం అవుతదని ప్రశ్నించారు. వాళ్లు ర్యాలీలు తీస్తూ వారి బలాన్ని ఎవరికి చూపిస్తున్నారని అన్నారు. ఈ ర్యాలీలో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేనకు చెందిన లక్షమంది కార్యకర్తలు పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొనే ముందు సిద్దివినాయక ఆలయాన్ని దర్శించుకున్నారు రాజ్ ఠాక్రే.