ఇవాళ సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటన

ఇవాళ సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటన

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇవాళ మంత్రికేటీఆర్ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు గంభీరావుపేట మండలం దమ్మన్నపేటలో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణము,రైతు వేదిక,రెడ్డి సంఘము భవనాలకు ప్రారంభోత్సవం చేస్తారు.అలాగే డ్రైనేజీల నిర్మాణాలకు భూమిపూజ చేస్తారు. అనంతరం దమ్మన్నపేటలో పల్లె ప్రకృతివనంను సందర్శించి,పోచమ్మ దేవాలయంలోని అమ్మవారిని దర్శించుకోనున్నారు.మధ్యాహ్నం ఒంటి గంటకు ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేటలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు ప్రారంభోత్సవం చేస్తారు.బొప్పాపూర్ గ్రామ శివారులో పీఏసీఎస్ ఎల్లారెడ్డిపేట గోదాం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు ఎల్లారెడ్డిపేటలో జడ్పీటీసీ కార్యాలయం..మధ్యాహ్నం 2:30 గంటలకు హరిదాసునగర్ లో గ్రంధాలయం ప్రారంభోత్సవం చేస్తారు.3 గంటలకు సిరిసిల్ల పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకారోత్సవానికి కేటిఆర్ హాజరుకానున్నారు.మధ్యాహ్నం 3.30 గంటలకు సిరిసిల్ల పట్టణంలో మినీ స్టేడియం,కొత్త చెరువు కు ప్రారంభోత్సవం చేస్తారు.

మరిన్ని వార్తల కోసం

యువతను మత్తు విపత్తులోకి జారనీయొద్దు

ల్యాండ్​పూలింగ్​కు భూములు ఇచ్చేది లేదు