రాజన్న హుండీ ఆదాయం రూ. కోటి 35 లక్షలు

రాజన్న హుండీ ఆదాయం రూ. కోటి 35 లక్షలు

వేములవాడ, వెలుగు:  వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి హుండీ లెక్కింపులో రూ.1 కోటి 35 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.  22 రోజుల హుండీ ఆదాయాన్ని ఆలయ ఓపెన్ స్లాబ్ లో ఎస్​పీఎఫ్ సిబ్బంది బందోబస్తు మధ్య శనివారం లెక్కించారు. 

ఈ సందర్భంగా స్వామివారి ఖజానాకు ఒక కోటి 35 లక్షల  25వేల 130 రూపాయల నగదు, 176 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారం, 9 కిలోల 700 గ్రాముల వెండి సమకూరింది. ఇందులో ఆలయ ఉద్యోగులు, రాజరాజేశ్వర సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.