రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారిక ప్రసంగాలతో... ఆశావోంకీ ఉడాన్ ఖండ్–2

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారిక ప్రసంగాలతో... ఆశావోంకీ ఉడాన్ ఖండ్–2

భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తన పాలనా కాలంలోని రెండో సంవత్సరంలో చేసిన అధికారిక ప్రసంగాల సంకలానాన్ని  రాష్ట్రపతి భవన్​లో జరిగిన ఒక కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్​సింగ్ విడుదల చేశారు. ఈ పుస్తకాన్ని ఆశావోంకీ ఉడాన్ ఖండ్ 2 అనే శీర్షికతో వెలువరించారు. ఈ పుస్తకంలో మొత్తం 51 ప్రసంగాలను పొందుపరిచారు. 

వికసిత భారత దార్శనికతకు ఇదొక కర్మ గ్రంథమవుతుందని రక్షణ మంత్రి రాజ్​ నాథ్ సింగ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ పుస్తకంలో అనేక అంశాలపై జాతిని ఉద్దేశించి భారత రాష్ట్రపతి ద్రౌపదీ  ముర్ము చేసిన ప్రసంగాలతోపాటు వివిధ విశ్వవిద్యాలయాల స్నాతకోత్సవాల్లో ఆమె చేసిన ఉపన్యాసాలను ఇందులో పొందుపరిచారు.