
భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తన పాలనా కాలంలోని రెండో సంవత్సరంలో చేసిన అధికారిక ప్రసంగాల సంకలానాన్ని రాష్ట్రపతి భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్సింగ్ విడుదల చేశారు. ఈ పుస్తకాన్ని ఆశావోంకీ ఉడాన్ ఖండ్ 2 అనే శీర్షికతో వెలువరించారు. ఈ పుస్తకంలో మొత్తం 51 ప్రసంగాలను పొందుపరిచారు.
వికసిత భారత దార్శనికతకు ఇదొక కర్మ గ్రంథమవుతుందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ పుస్తకంలో అనేక అంశాలపై జాతిని ఉద్దేశించి భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేసిన ప్రసంగాలతోపాటు వివిధ విశ్వవిద్యాలయాల స్నాతకోత్సవాల్లో ఆమె చేసిన ఉపన్యాసాలను ఇందులో పొందుపరిచారు.