లోక్ సభలో టీఆర్ఎస్ ఆందోళన... రాజ్యసభ వాయిదా

లోక్ సభలో టీఆర్ఎస్ ఆందోళన... రాజ్యసభ వాయిదా

పార్లమెంట్ సమావేశాలు ఏడో రోజు ప్రారంభం అయ్యాయి. అయితే ప్రారంభం అయిన కాసేపటికే రాజ్యసభ వాయిదా పడింది. సభలో విపక్ష ఎంపీల సస్పెన్షన్ పై ప్రతిపక్షలు ఆందోళనకు దిగాయి. వెంటనే ఎంపీలపై వేసిన సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో సభను వాయిదా వేశారు.  మరోవైపు వాయిదా తీర్మానం నోటీసుల్ని కూడా రాజ్యసబ ఛైర్మన్ వెంకయ్య నాయుడు తిరస్కరించారు. సభలో సభ్యుల ఆందోళనతో రాజ్యసభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు. మరోవైపు లోక్ సభలో కూడా ప్రతిపక్షాలు నిరసనకు దిగాయి. లోక్ సభలో స్పీకర్ పోడియం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. తెలంగాణ రైతులకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులు పట్టుకొని తమ నిరసన వ్యక్తం చేశారు. రబీలో పండే ధాన్యం కొనుగోలుపై నిర్ణయం తీసుకోవాలంటూ టీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.