అన్నా.. రాఖీ పంపుతున్నా.. నేను రావట్లే..

అన్నా.. రాఖీ పంపుతున్నా.. నేను రావట్లే..

కరోనా ఎఫెక్ట్‌‌‌‌ తో ఆడబిడ్డలు పుట్టింటికి పోలేని పరిస్థితి..
రాఖీలను కొరియర్‌‌‌‌ చేస్తున్న అక్కాచెల్లెళ్లు
అర్థం చేసుకొని ఈసారికి వద్దంటున్న అన్నాతమ్ముళ్లు
డల్‌గా పండుగల శ్రావణం.. అంతా సాదాసీదా

‘అన్నా.. ఎట్లున్నవే.. ఈసారి రాఖీ కట్టడానికి వస్తలేను. కరోనా టైమ్‌‌‌‌ల పిల్లను తీస్కొని అంతదూరం బస్సుల రావల్నంటే మనసొప్పుతలేదు. మీ బావ సుత వద్దంటండు. కరోనా తగ్గితె దసరాకు అందరం వస్తం. రాఖీ కొరియర్ జేసిన. ఈతాపకు నీ బిడ్డతో కట్టించుకో’ అంటూ ఫోన్ల చెప్పంగనే ‘సరే చెల్లె. కరోనా బగ్గుంది. పైలం’ అంటున్నరు అన్నలు. అక్కాతమ్ముళ్ల నడుమ కూడ ఫోన్ల్ల ఇదే టాపిక్ నడుస్తంది. కరోనా కారణంగా దూరంగా ఉన్న అన్నదమ్ముల దగ్గరకు వెళ్లలేని అక్కాచెల్లెండ్లు కొరియర్‌‌‌‌లో, పోస్టులో, ఆర్టీసీ కార్గో సర్వీసు ద్వారా రాఖీలు పంపిస్తున్నరు.

వరంగల్‍ రూరల్‍, వెలుగు: శ్రావణమంటేనే పండుగల నెల. ఏ ఇంట్లో చూసినా పూజలు, ఒక్కపొద్దులు కామన్. ఈ నెలలో వచ్చే రాఖీ పండుగకు మన ఆడబిడ్డలు నెల ముందు నుంచే ప్రిపేర్ అవుతారు. ఒకట్రెండు రోజులు పుట్టింటికి వెళ్లే ప్రోగ్రామ్‌ ‌పెట్టుకుంటారు. కానీ ఈ ఏడాది కరోనాతో ఆడబిడ్డలు టెన్షన్‍ పడుతున్నారు. పోవాలా.. వద్దా? ఒకవేళ పోతే కరోనావస్తే పరిస్థితేంటి? అని ఆలోచిస్తున్నారు. దగ్గరున్న వాళ్లు బైకులపై వెళ్లివచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నా దూరం ఉన్నవాళ్లు తప్పనిసరి పరిస్థితుల్లో రాఖీలను పోస్టు చేస్తున్నారు.

ఏ పండుగ చేస్కునేటట్లు లేదు
శ్రావణంలో ఆది, బుధవారాల్లో వంటలకు వెళ్తుంటారు. కానీ కరోనాతో ఈసారి ఆ పరిస్థితి లేదు. జనాలు మొక్కుబడిగా కోడిని బయట కోసి ఇంట్లోనే వండుకు తింటున్నరు. ఈ నెలలో పోచమ్మలు పెట్టుడంటే అదో ఆర్భాటం. ఆది, బుధవారాల్లో కాలనీల వారీగా వందల సంఖ్యలో బోనాలు, పొట్టేళ్లబండ్లు, పోతురాజుల విన్యాసాలు, డీజే చప్పుళ్లతో ఆలయాలకు వెళ్తుంటే రోడ్లన్నీ కలర్‍ఫుల్‍గా కనిపించేవి. కానీ ఈ హడావుడీ ఎక్కడా లేదు. బైక్‌‌పై వెళ్లి అమ్మవారికి బోనం అప్పజెప్పి క్షణాల్లో వచ్చేస్తున్నరు. పండుగను ఆచారంగా నిర్వహించుకునే కులపోళ్లు కూడా నాలుగైదు బోనాలతో వెళ్లొస్తున్నారు.

వేడుకలు సింపుల్‌‌గా..
ఇప్పటికే అన్నాచెల్లెళ్లు రాఖీ పండుగకు దూరమవుతుండగా పంద్రాగస్టు వేడుకలనను కూడా ప్రభుత్వం సింపుల్‍గా ప్లాన్‍ చేస్తోంది. గల్లీగల్లీకి ప్రతిష్టించే వినాయక మండపాలూ ఈసారి తగ్గనున్నాయి. విగ్రహాల తయారీపై ఇప్పటికే తీవ్ర ప్రభావం పడింది. మరీ తప్పదనుకునే వాళ్లే హడవుడి లేకుండా శ్రావణం పెళ్ళళ్లలకు రెడీ అవుతుండగా చాలామంది దీపావళి సీజన్‌‌కు పోస్ట్‌‌పోన్ చేసుకుంటున్నారు.

కరోనా భయంతో వెళ్లట్లే
తమ్మునికి రాఖీ కట్టడానికి ఏటా గుంటూరు వెళ్లేదాన్ని. కరోనా వల్ల ఈసారి పోవట్లేదు. తమ్మునికి విషయం చెప్పి కొరియర్‍ ద్వారా రాఖీ పంపించా. వచ్చే ఏడాది వస్తానన్నా. – దీపిక వెలమూరి (హన్మకొండ)

చాలా బాధగా ఉంది
ఎప్పుడూ ముందస్తుగానే ప్లాన్‍ చేసుకుని అన్న ఉండే వరంగల్‍ వెళ్లేదాన్ని. ఈసారి కరోనా వల్ల జర్నీ చేయాలంటేనే భయమేస్తోంది. పోస్టు ద్వారా రాఖీ పంపినా డైరెక్టుగా వెళ్లట్లేదనే బాధ ఎక్కువుంది. – చర్లపల్లి కల్పన (వేములవాడ)

For More News..

వార్డెన్ నిర్లక్ష్యంతో 14 మంది అంధులకు కరోనా

సెక్రటేరియట్‌ ‌డిజైన్‌లో మార్పులు

ఇగ కొత్త చదువులు

మన నేలపై కన్నేసిన వారికి ఇదో హెచ్చరిక