సీతారాముడిలా రామ్ చరణ్, ఉపాసన.. AI జనరేటెడ్ ఫోటో వైరల్

సీతారాముడిలా రామ్ చరణ్, ఉపాసన.. AI జనరేటెడ్ ఫోటో వైరల్

ప్రస్తుతం భారతదేశమంటా రామ నామ స్మరణ వినిపిస్తోంది. జై శ్రీరామ్(Jai Shriram) నినాదాలతో ప్రజలు సంబురాలు చేసుకుంటున్నారు. దాదాపు 500 ఏళ్ళ కల సాకారమవుతున్న వేళ.. భక్తులు ఆనందంతో రామచంద్ర మూర్తికి ఆహ్వానం పలుకుతున్నారు. అయోధ్య(Ayodhya)లోని రామ్ మందిరం(Ram Mandhir)లో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన కోసం, ఆ మధుర క్షణాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వేడుక కోసం దేశనలుమూలల ఉన్న చాలా మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. 

వారిలో టాలీవుడ్ నుండి రామ్ చరణ్ దంపతులు కూడా ఉన్నారు. ఇందుకోసం రామ్ చరణ్(Ram charan), ఉపాసన(Upasana) ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నారు కూడా. అయితే.. ఈ ప్రత్యేకరోజును పురస్కరించుకొని మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్, ఉపాసన వెళ్లినట్లుగా  AI టెక్నాలజీ ని ఉపయోగించి ఒక ఇమేజ్ ను క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన మెగా ఫ్యాన్స్.. రామ్ చరణ్, ఉపాసన సీతారాముడిలా ఉన్నారంటూ, కలకాలం ఇలాగే కలిసి ఉండాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరోపక్క మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) దంపతులు కూడా రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నారు. అక్కడ నేషనల్ మీడియాతో మాట్లాడిన చిరంజీవి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఇది నిజంగా ఒక గొప్ప అనుభూతి అని, మాటల్లో వారించలేకపోతున్నానని, ఇంతటి బృహత్కర కార్యక్రమంలో తమ కుటుంబం కూడా పాల్గొనడం పూర్వజన్మ సుకృతం.. అంటూ చెప్పుకొచ్చారు.