అత్తమామల దగ్గరకు షిఫ్ట్‌ అవుతున్నాం : ఉపాసన

అత్తమామల దగ్గరకు షిఫ్ట్‌ అవుతున్నాం : ఉపాసన

గ్లోబల్‌ స్టార్ రామ్ చరణ్(Ram Charan) - ఉపాసన(Upasana) త్వరలోనే తల్లితండ్రులు కాబోతున్నారు. ఈ జంట పెళ్లయిన 11 ఏళ్లకు తమ మొదటి బిడ్డకు స్వాగతం పలకనున్నారు. ప్రస్తుతం ఎనిమదవ నెల ప్రెగ్నెంట్ గా ఉన్న ఉపాసన.. త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనుంది. దీంతో మెగా కుటుంబంలో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. 

ఇందులో భాగంగా తమకు పుట్టిబోయే బిడ్డ గురించి కీలక నిర్ణయం తీసుకున్నారట రామ్ చరణ్, ఉపాసన జంట. ప్రస్తుతం వేరే ఇంట్లో ఉంటున్న ఈ జంటగా త్వరలోనే చిరంజీవి(Chirajeevi) ఇంటికి షిఫ్ట్ అవుతున్నారట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపాసన ఈమేరకు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

'నేను, చరణ్‌ ఈ స్థాయిలో ఉన్నాం అంటే దానికి కారణం మా గ్రాండ్ పేరెంట్స్ మాకు పంచిన ప్రేమ వల్లే. ఆ ప్రేమ నా బిడ్డకు కూడా దక్కాలి. అందుకే ఇకనుండి అత్తయ్య, మావయ్యతో కలసి ఉండాలని  నిర్ణయించుకున్నాం. వారి ప్రేమను నా బిడ్డకు దూరం చేయకూడదనే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం" అని చెప్పుకొచ్చింది ఉపాసన. ఆమె నిర్ణయానికి మెగా ఫ్యాన్స్, నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.