శ్రీలంకలో పెద్ది మూవీ కొత్త షెడ్యూల్..

శ్రీలంకలో పెద్ది మూవీ కొత్త షెడ్యూల్..

రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రూరల్‌‌ యాక్షన్ డ్రామా ‘పెద్ది’.  జాన్వీ కపూర్ హీరోయిన్‌‌గా నటిస్తోంది. బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది.  ఈ మూవీ కొత్త షెడ్యూల్‌‌ను శ్రీలంకలో ప్లాన్ చేశారు. ఇందుకోసం చరణ్‌‌, దర్శకుడు బుచ్చిబాబు సహా యూనిట్ సభ్యులు శుక్రవారం అక్కడికి వెళ్లారు.  శనివారం నుంచి అక్కడి అందమైన ప్రదేశాల్లో రామ్ చరణ్‌‌, జాన్వీకపూర్‌‌‌‌ జంటపై ఓ పాటను చిత్రీకరించనున్నారు. 

ఇందుకోసం ఆస్కార్ విజేత ఏ.ఆర్‌‌‌‌.రహమాన్‌‌ ఇప్పటికే ఓ రొమాంటిక్ సాంగ్‌‌ను కంపోజ్ చేశారు.  ఇక కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఇందులో ఓ కీలక పాత్రను పోషిస్తుండగా జగపతి బాబు, దివ్యేందు శర్మ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. డీవోపీ రత్నవేలు, ఎడిటర్‌‌‌‌ నవీన్ నూలి సహా పలువురు టాప్‌‌ టెక్నీషియన్స్‌‌ ఈ మూవీకి వర్క్ చేస్తున్నారు.  

మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. చరణ్ బర్త్ డే సందర్భంగా వచ్చే ఏడాది మార్చి 27న సినిమాను విడుదల చేయబోతున్నారు.