Ram Charan: రామ్ చరణ్కి అరుదైన గౌరవం.. వేల్స్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్

Ram Charan: రామ్ చరణ్కి అరుదైన గౌరవం.. వేల్స్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) కు మరో అరుదైన గౌరవం దక్కింది. చెన్నైలోని పల్లవరంలోని వేల్స్ వర్చువల్ యూనివర్సిటీ(Wales Virtual University) ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఈ నెల 13న చెన్నైలోని పల్లవరంలోని వేల్స్ వర్చువల్ యూనివర్సిటీ స్నాతకోత్సవ వేడుకలు జరుగనున్నాయి. సినీ నిర్మాత, యూనివర్శిటీ ఛాన్సలర్ ఈసరి గణేష్ ఆద్వర్యంలో ఈ వేడుకలు అట్టహాసంగా జరగనున్నాయి.

ఈ వేడుకలకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. ఈ వేడుకల్లో భాగాంగానే.. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) అధ్యక్షుడు డీజీ సీతారాం  తెలుగు సినీ ఇండస్ట్రీకి రామ్ చరణ్ అందించిన సేవలకు గాను ఈ గౌరవ డాక్టరేట్ అందజేయనున్నారు. ఈ వేడుకకు రామ్ చరణ్ తోపాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. ఇక రామ్ చరణ్ కు ఈ అరుదైన గౌరవం దక్కడంపై మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తరువాత రామ్ చరణ్ నుండి వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయనుందో చూడాలి.