ఒక రోజు పర్యటన కోసం హైదరాబాద్ కు రాష్ట్రపతి

ఒక రోజు పర్యటన కోసం హైదరాబాద్ కు రాష్ట్రపతి

ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యానమందిరాన్ని రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ గ్రామ పంచాయతీలో ఇటీవల ప్రారంభించారు. ఈ ధ్యాన మందిరాన్ని సందర్శించేందుకోసం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఒక రోజు పర్యటన నిమిత్తం ఇవాళ హైదరాబాద్ వచ్చారు.

ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్న రామ్ నాథ్ కోవింద్ దంపతులకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, సీఎం కేసీఆర్ తో పాటు పలువురు మంత్రులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. రెండేళ్ల క్రితం రామ్ నాథ్ కోవింద్ ఈ ధ్యాన మందిరానికి శంకుస్థాపన చేశారు.