సైబర్నేరాలను అరికట్టడమే టీజీసీఎస్‌‌‌‌‌‌‌‌బీ లక్ష్యం : సీపీ అంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కిశోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఝా

సైబర్నేరాలను అరికట్టడమే టీజీసీఎస్‌‌‌‌‌‌‌‌బీ లక్ష్యం : సీపీ అంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కిశోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఝా
  • రామగుండం సీపీ అంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కిశోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఝా

గోదావరిఖని, వెలుగు: పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టడం, ప్రజల్లో అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌‌‌‌‌‌‌‌బీ) పనిచేస్తుందని రామగుండం సీపీ అంబర్​కిశోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఝా అన్నారు. ‘ఫ్రాడ్​ కా ఫుల్​స్టాప్​' పేరిట రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సైబర్​ భద్రత ప్రచార కార్యక్రమ వాల్​పోస్టర్లను మంగళవారం కమిషనరేట్‌‌‌‌‌‌‌‌లో ఆయన ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ‘సైబర్​ సారధి@1930’, ‘స్కామ్​సే బచావ్​’, ‘పైసా పైలం’, ‘హర్​ స్క్రీన్​సురక్షిత్​’, ‘మేరా లాగిన్​ మేరా రూల్’, ‘మహిళా రక్షణ–-పిల్లల సంరక్షణ–1930 హెల్ప్​లైన్’, ‘గోల్డెన్​ అవర్​రిపోర్టింగ్–ప్రాముఖ్యత’ వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సైబర్ మోసాల నివారణకు వెంటనే ఫిర్యాదు చేయడం, అవగాహనతో వ్యవహరించడం అత్యంత కీలకమని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. 

సైబర్​క్లబ్స్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేయాలని, ఇందులో ప్రతి కాలేజీ నుంచి ఒక టీచర్​, ఐదుగురు స్టూడెంట్లు ఉండేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఏసీపీ రమేశ్‌‌‌‌‌‌‌‌, సీసీపీఎస్‌‌‌‌‌‌‌‌ ఏసీపీ రంగారెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, సైబర్ క్రైమ్ సీఐ శ్రీనివాస్, సీసీపీఎస్‌‌‌‌‌‌‌‌ సీఐ కృష్ణమూర్తి, పాల్గొన్నారు.