24న 'రామారావు ఆన్ డ్యూటీ' ప్రీ రిలీజ్ ఈవెంట్

 24న 'రామారావు ఆన్ డ్యూటీ' ప్రీ రిలీజ్ ఈవెంట్

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా ప్రస్తుతం 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీలో నటిస్తున్నాడు. డైరెక్టర్ శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్స్‌గా రజీషా విజయన్, దివ్యాంశ కౌశిక్ అలరించనున్నారు. ఈ చిత్రం ఈనెల 29న భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌ జోరు పెంచారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. జులై 24న హైదరాబాద్ ఫిలింనగర్ లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో సాయంత్రం 6 గంటలకు నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించిన ఓ పోస్టర్ కూడా వదిలారు చిత్ర బృందం.

సినిమాపై భారీ అంచనాలు

ఇక ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుని సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. ఇప్పటికే ఈ చిత్రానికి వచ్చిన పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కాగా, ఈ మూవీలో రవితేజ గవర్నమెంట్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ మూవీని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్, రవితేజ టీమ్ వర్క్స్ సంస్థలపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. హీరో రవితేజ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సామ్ సిఎస్ ఈ మూవీకి సంగీతం అందించారు.