
చేవెళ్ల, వెలుగు: గుడిసెల్లో ఉంటున్న వారికి ఇండ్ల పట్టాలివ్వాలని సీపీఐ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యుడు రామస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం చేవెళ్లలోని సీపీఐ కాలనీ ఫేజ్–2లో కాలనీవాసులు ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన చీఫ్గెస్టుగా హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు.
చేవెళ్ల మండల కేంద్రంలోని 75వ సర్వే నంబర్లో 10 నెలలుగా గుడిసెలు వేసుకుని ఉంటున్న వారికి మౌలిక సదుపాయాలు, కరెంట్ సౌకర్యం కల్పించాలన్నారు. ఈ నెల 26న మండల కేంద్రంలో సీపీఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో ఏఐకేఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సుధాకర్ గౌడ్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, మండల పార్టీ కార్యదర్శి సత్తిరెడ్డి పాల్గొన్నారు.