ఇది రామాయణ్ సర్క్యూట్లోని మొదటి ట్రైన్. ఢిల్లీలోని సఫ్దర్గంజ్ రైల్వే స్టేషన్ నుంచి ఆదివారం బయలుదేరిన ఈ లగ్జరీ రైలు 17 రోజుల్లో దేశం మొత్తాన్ని చుట్టిరానుంది. రాముడి జీవితానికి సంబంధించిన ప్రదేశాల మీదుగా ఈ రైలు ప్రయాణం సాగుతుంది. ఈ రైలులో రామాయణానికి సంబంధించిన విశేషాలన్నీ ప్రదర్శిస్తున్నారు. శ్రీరాముడి జన్మభూమి అయోధ్యలో మొదటి హాల్ట్ తీసుకుంటుంది. అక్కడి రాముని, హనుమంతుని ఆలయాలతోపాటు నందిగ్రామ్లోని భారత్ మందిరాన్ని దర్శించుకోవచ్చు. ఆ తర్వాత బీహార్లోని సీతామర్హిలోని సీతమ్మ జన్మస్థలం, జనక్పూరిలోని రామ్-జానకీ ఆలయానికి వెళ్లొచ్చు. అక్కడి నుంచి రైలు వారణాసి చేరుతుంది. పర్యాటకులకు రోడ్డు మార్గంలో వారణాసి, ప్రయాగ, శృంగవర్పూర్, చిత్రకూట్ దేవాలయాలను సందర్శిస్తారు. ఆ తర్వాత నాసిక్కు బయలుదేరుతుంది. ఇక్కడ త్రయంబకేశ్వరాలయం.. పంచవటి చూపిస్తారు. అనంతరం కిష్కింధ నగరం హంపి.. చివరగా రామేశ్వరం తీసుకెళ్తారు. 17వ రోజున ఢిల్లీకి తిరిగి చేరుకుంటారు. ‘దేఖో అప్నా దేశ్’లో భాగంగా చేపట్టిన ఈ యాత్ర కోసం ఒక్కో వ్యక్తికి సెకండ్ ఏసీకి రూ.82.950, ఫస్ట్ ఏసీకి రూ.1,02,095 ధర నిర్ణయించారు. రైలు మొత్తం ఏసీనే. స్టార్ హోటల్ స్థాయిలో వసతులు కల్పించారు. ఏసీ బస్సులు, వాహనాల్లోనే భక్తులను తీసుకెళతారు. యాత్ర సందర్భంగా శాఖాహార భోజనమే అందించనున్నారు.
లగ్జరీ సౌకర్యాలతో రామాయణ్ రైలు
- దేశం
- November 9, 2021
లేటెస్ట్
- Vijay GOAT: హాలీవుడ్ రేంజ్లో విజయ్ గోట్..అవతార్,అవెంజర్స్ నిపుణుల వీఎఫ్ఎక్స్
- Forbes List 2024: దరిదాపుల్లో లేని కోహ్లీ.. అత్యధిక ఆదాయం పొందుతున్న టాప్ 10 అథ్లెట్లు వీరే
- IIT JEE అడ్వాన్స్డ్ 2024 అడ్మిట్ కార్డులు విడుదల
- రాష్ట్రానికి రూ.వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నయ్: మంత్రి శ్రీధర్ బాబు
- Jr Ntr: ఎన్టీఆర్ స్థలం వివాదంలో కొత్త ట్విస్ట్.. అసలు ఆయనకు సంబంధమే లేదట!
- వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టు ఎదుట వైఎస్ అవినాష్ రెడ్డి...
- హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష
- ఫ్రీబస్ స్కీంను తప్పుబట్టిన మోదీ..కౌంటర్ ఇచ్చిన కేజ్రీవాల్
- మోటోరోలా నుంచి కొత్త ఫోన్..ధర, ఫీచర్లు ఇవిగో
- Karthik Aryan: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. బాలీవుడ్ స్టార్ హీరో బంధువులు మృతి
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- Mohini ekadashi 2024: మోహిని ఏకాదశి రోజున ఈ వస్తువులు దానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- కుండపోత వాన