ఆ నిర్మాతను నమ్మకండి : రానా

ఆ నిర్మాతను నమ్మకండి : రానా

తమిళ్ డైరెక్టర్ సత్యశివ డైరెక్షన్ లో దగ్గుపాటి రానా నటిస్తున్న కొత్త మూవీ 1945.. దీపావళి సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది యూనిట్. అయితే మూవీ నిర్మాత, రానాకు మధ్య వివాదం తలెత్తింది.  1945 మూవీ ఇంకా పూర్తి కాలేదని.. ఆ నిర్మాతను కలిసి ఏడాదికి పైగా అయ్యిందన్నారు రానా.  సినిమాను మార్కెట్ చేసి డబ్బులు సంపాదించుకోవడం కోసమే నిర్మాత  పోస్టర్ ను రిలీజ్ చేశారని..ఇలాంటి వాటిని ప్రోత్సహించొద్దంటూ ట్వీట్ చేశారు రానా.

అయితే రానా కామెంట్ పై నిర్మాత రాజారాజన్ ట్విట్టర్లో స్పందించారు. సినిమా పూర్తయిందా లేదా? అనేది  ఒక డైరెక్టర్ డిసైడ్ చేస్తాడు లేదా  ప్రేక్షకులు నిర్ణయిస్తారని అన్నారు. 60 రోజులు షూటింగ్ చేసి సినిమాపై కోట్ల రూపాయలు ఖర్చుపెట్టానని అన్నారు.పూర్తి కానీ సినిమాను ఎవరూ రిలీజ్ చేయరని కామెంట్ చేశాడు.