రణ్బీర్కపూర్ (Ranbir Kapoor), రష్మిక మందన్న(Rashmika Mandanna) జంటగా నటించిన యానిమల్ (Animal) మూవీకి సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించాడు. బాబీ డియోల్ విలన్గా నటించిన ఈ మూవీ తెలుగు వెర్షన్ బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. రెండు రోజుల్లోనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ను సాధించింది.
యానిమల్ సినిమాకు ఎక్కడ చూసిన ఎక్కువ శాతం పాజిటివ్ టాక్ వస్తోంది. అంతేకాకుండా థియేటర్స్ నుంచి వీడియో బైట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఓటీటీ ఆడియాన్స్ స్ట్రీమింగ్ ఎప్పుడని వెయిట్ చేస్తున్నారు.
లేటెస్ట్ గా OTT స్ట్రీమింగ్ కి సంబంధించిన న్యూస్ వినిపిస్తోంది. ఈ మూవీని తెలుగు ఆడియన్స్ కోసం 2024 జనవరి సంక్రాంతి కానుకగా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తోన్నారు. అంటే డిసెంబర్ 1 న రిలీజైన యానిమల్ మూవీ..ఇంకో 45 నుంచి 60 రోజుల్లో అందుబాటులోకి రానుందన్నమాట. అలాగే హిందీ ఆడియన్స్ కోసం జనవరి 26 న రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వైల్డ్ యాక్షన్ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ (NetFlix) లో ప్రసారం కానున్నట్లు సమాచారం.
ఇక యానిమల్ సినిమాకు మేకర్స్ దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ పెట్టారు కానీ.. కేవలం మూడు రోజుల్లోనే రూ.356 కోట్లు కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ సాధించింది యానిమల్ మూవీ. ఇక డిసెంబర్ 7 వరకు కొత్త సినిమాలు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఈ వారం రోజుల్లో నెక్స్ట్ లెవల్ కలెక్షన్స్ సాధించనుంది యానిమల్ మూవీ. దీంతో మేకర్స్ కు భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంది. మరి లాంగ్ రన్ లో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయనుందో చూడాలి.