ట్రిపుల్ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై స్పెషల్ రివ్యూ.. నిర్వాసితులకు ఎకరానికి రూ. 1.20 కోట్ల వరకూ పరిహారం చెల్లిస్తే..

ట్రిపుల్ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై స్పెషల్ రివ్యూ.. నిర్వాసితులకు ఎకరానికి రూ. 1.20 కోట్ల వరకూ పరిహారం చెల్లిస్తే..

యాదాద్రి, వెలుగు: రీజినల్ ​రింగ్ ​రోడ్​(ట్రిపుల్​ఆర్) ఫైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేంద్ర రోడ్లు, బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖ మంత్రి నితిన్​గడ్కరీ వద్దకు చేరింది. సోమవారం యాదాద్రి కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ, నేషనల్ హైవే అధికారులు ప్రత్యేకంగా రివ్యూ చేశారు. సాధ్యమైనంత స్పీడ్గా భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

ఈ రివ్యూలో ప్రధానంగా భువనగిరి మండలం రాయగిరి అంశంపైనే చర్చ జరిగింది. గతంలో భువనగిరి కాలా పరిధిలోని రాయగిరిలో సర్వేను నిర్వాసితులు అడ్డుకోవడంతో భూ సేకరణ ఆగిపోయింది.

హైవే పక్కనే ఉన్నందున, చౌటుప్పల్​తరహాలో ఎకరానికి రూ. 1.20 కోట్ల వరకూ పరిహారం చెల్లిస్తే నిర్వాసితులు అంగీకరించే అవకాశం ఉందని జిల్లా ఆఫీసర్లు ఉన్నతాధికారులకు వివరించారు. ముందుగా నిర్వాసితులతో మీటింగ్​ ఏర్పాటు చేసి ఒప్పించాలని నిర్ణయించారు.  రివ్యూలో నేషనల్​ హైవే ఆఫీసర్లు, యాదాద్రి అడిషనల్​ కలెక్టర్లు ఎ.భాస్కరరావు, వెంకారెడ్డి, ఆర్డీవో కృష్ణారెడ్డి ఉన్నారు.

ఆర్బిట్రేషన్ ​పెంపు రూ. 26.12 కోట్లు జమ
ఆర్బిట్రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెంచిన పరిహారం మూడు గ్రామాల నిర్వాసితులకు అకౌంట్లలో నేషనల్​హైవే జమ చేసింది. పెంచిన పరిహారం దత్తాయిపల్లి నిర్వాసితుల అకౌంట్లలో రూ. 13 కోట్లు, ఇబ్రహీంపూర్​ నిర్వాసితులకు రూ. 3.21 కోట్లు, కోనాపురం నిర్వాసితులకు రూ. 9.91 కోట్లు జమయినట్లు అధికారులు తెలిపారు.