పదమూడు పీఠాల్లో  పది కాంగ్రెస్ వే.. ఇబ్రహీంపట్నంలో ఉత్కంఠ మధ్య ఎన్నిక ఫిబ్రవరి 17 కు వాయిదా

పదమూడు పీఠాల్లో  పది కాంగ్రెస్ వే.. ఇబ్రహీంపట్నంలో ఉత్కంఠ మధ్య ఎన్నిక ఫిబ్రవరి 17 కు వాయిదా
  • రంగారెడ్డిలో 5 స్థానాలు కైవసం 
  • మెజారిటీ లేకున్నా అలియాబాద్​లో పాగా
  • ఆమనగల్​లో ఒక్క సీటు గెలిచినా పై‘చేయి’
  • హంగ్ ​వచ్చిన మూడు చోట్లా హస్తానిదే హవా  
  • వికారాబాద్​లోని నాలుగు చోట్లా చెయ్యే  

చేవెళ్ల/షాద్​నగర్/ఇబ్రహీంపట్నం/వెలుగు : మున్సిపల్​ చైర్​పర్సన్​ఎన్నికల హస్తం హవా నడిచింది. వికారాబాద్ ​జిల్లాలో నాలుగింటికి నాలుగు స్థానాల్లో పాగా వేసింది. రంగారెడ్డి జిల్లాలో స్పష్టమైన మెజార్టీ సాధించిన చేవెళ్ల, శంకర్​ పల్లి, షాద్​ నగర్​ మున్సిపాలిటీల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చైర్​ పర్సన్​​, వైస్​ చైర్​ పర్సన్​​ స్థానాలను దక్కించుకుంది. హంగ్​ వచ్చిన మొయినాబాద్​ మున్సిపాలిటీ, కేవలం ఒకే ఒక్క కౌన్సిలర్ గెలిచిన అమన్​గల్ మున్సిపాలిటీని సైతం కైవసం చేసుకుంది. మేడ్చల్​మల్కాజిగిరిలో జిల్లాలో రెండు స్థానాలను బీఆర్ఎస్ పూర్తి మెజారిటీతో దక్కించుకోగా హంగ్​ఏర్పడిన ఆలియాబాద్​లో చైర్​పర్సన్​ సీటును కాంగ్రెస్​తన ఖాతాలో వేసుకుంది. ఇబ్రహీంపట్నంలో 24 స్థానాలకు బీఆర్ఎస్ 13 స్థానాలు గెలుచుకున్నా ఆ పార్టీ చైర్​పర్సన్ ​అభ్యర్థి కనిపించకుండా పోవడంతో ఎన్నికను మంగళవారానికి వాయిదా వేశారు. 

రంగారెడ్డి జిల్లాలో.. 

చేవెళ్ల మున్సిపల్​ చైర్​పర్సన్​గా కాంగ్రెస్​తరఫున16వ వార్డు నుంచి గెలిచిన దేవరి సమతా వెంకట్​రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక్కడ18 వార్డులుండగా..11 కాంగ్రెస్, 4 బీఆర్ఎస్, 3 బీజేపీ విజయం సాధించాయి. స్పష్టమైన మెజారిటీ రావడంతో 15 వ వార్డు నుంచి గెలిచిన సమతా వెంకట్ రెడ్డి చైర్​పర్సన్​గా, 13వ వార్డు నుంచి గెలుపొందిన రాములు గౌడ్​ వైస్​ చైరపర్సన్​గా ఎన్నికయ్యారు. శంకర్​పల్లిలో 15 వార్డులుండగా.. 9 కాంగ్రెస్​,4 బీఆర్​ఎస్​, 2 ఇండిపెండెంట్లు గెలిచారు. ఇక్కడ కాంగ్రెస్​ తరఫున 15వ వార్డు నుంచి గెలిచిన సాత ప్రవీణ్​ కుమార్ ​చైర్​పర్సన్​గా, 14 వ వార్డు నుంచి గెలిచిన జూలకంటి శ్వేతా పాండురంగా రెడ్డి వైస్​ చైర్​పర్సన్​ గా ఎన్నికయ్యారు. 

షాద్​నగర్​లో 28 స్థానాలుండగా..15 కాంగ్రెస్, 11 బీఆర్ఎస్​, ఒకటి బీజేపీ, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. ఈ మున్సిపాలిటీ చైర్​పర్సన్​గా 23వ వార్డు నుంచి గెలిచిన అగ్గునూరి బసవేశ్వర్, వైస్​ చైర్​పర్సన్​గా 14వ వార్డు మెంబర్​ అందె మోహన్ ఎన్నికయ్యారు.  

ఆమనగల్​లో బీఆర్ఎస్​ నుంచి  6వ వార్డు అభ్యర్థిగా గెలిచిన నేనావత్ పత్యనాయక్ కాంగ్రెస్​లో చేరి బీజేపే మద్దతుతో చైర్​పర్సన్ అయ్యారు. ఇక్కడ 15 వార్డులుండగా..8 బీఆర్ఎస్​, 6 బీజేపీ, 1 స్థానం కాంగ్రెస్​ గెలుచుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎక్స్​అఫిషియో ఓటు నమోదు చేసుకున్నాడు. కాంగ్రెస్ నుంచి కౌన్సిలర్ పత్య నాయక్, బీఆర్ఎస్  నుంచి పాపిశెట్టి రామకృష్ణ నామినేషన్ వేగయా, పత్య నాయక్​కు 9 ఓట్లు, రామకృష్ణ కు 7 ఓట్లు వచ్చారు. వైస్ చైర్ పర్సన్ గా బీజేపీ నుంచి గెలిచిన 3వ వార్డు కౌన్సిలర్ తల్లోజు గీత ఎన్నికయ్యారు.  

మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లాలో ..

మేడ్చల్ కలెక్టరేట్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి  మున్సిపాలిటీలో 24 వార్డులుండగా 14 వార్డులు బీఆర్ఎస్, కాంగ్రెస్ 9, బీజేపీ ఒక స్థానాన్ని దక్కించుకున్నాయి. పూర్తి మెజారిటీ రావడంతో మున్సిపల్ చైర్​పర్సన్​గా  బీఆర్​ఎస్​ వార్డు మెంటర్​ జాము రవి, వైస్ చైర్​పర్సన్​గా మొరుసు బావి శశిరేఖను ఎన్నుకొన్నారు. 

ఎల్లంపేటలో 24 వార్డులు ఉండగా, బీఆర్ఎస్ కు 12, కాంగ్రెస్ కు 8, బీజేపీకి 4 సీట్లు వచ్చాయి. మ్యాజిక్​ ఫిగర్​13 కావడంతో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి ఉన్న ఎక్స్- అఫీషియో ఓటు, బీజేపీ సభ్యుల మద్దతుతో చైర్​పర్సన్, వైస్​ చైర్​పర్సన్​స్థానాలను దక్కించుకుంది. బీఆర్ఎస్ నుంచి 8వ వార్డు మెంబర్​ లావుడ్య శ్రీదేవి చైర్​పర్సన్​గా, వైస్ చైర్​పర్సన్​గా బీజేపీ19వ వార్డు నుంచి గెలిచిన మేకల రజిత దేవేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. 

వికారాబాద్​జిల్లాలో...

కొడంగల్: వికారాబాద్​ జిల్లాలో వికారాబాద్, పరిగి, కొడంగల్, తాండూరులో కాంగ్రెస్​ అభ్యర్థులే చైర్​పర్సన్లు అయ్యారు.   కొడంగల్​లో 12 వార్డులు ఉండగా, 10 కాంగ్రెస్​, 1 బీఆర్​ఎస్​, 1ఎంఐఎం గెలిచాయి.  పూర్తి మెజారిటీ ఉండడంతో చైర్​పర్సన్​గా 4వ వార్డు కౌన్సిలర్​నందారం ప్రశాంత్,  వైస్​ చెర్​పర్సన్​గా 8వ వార్డు కౌన్సిలర్​ శంకర్​నాయక్​ గెలుపొందారు.

 పరిగిలో ఉత్కంఠ మధ్య కాంగ్రెస్ చైర్​పర్సన్​, వైస్ ​చైర్​పర్సన్​ పీఠాలను దక్కించుకుంది. వికారాబాద్​లో కాంగ్రెస్ ​గెలుపుతో అసెంబ్లీ స్పీకర్​ప్రసాద్​కుమార్​తనయ అనన్య మున్సిపల్​ చైర్​పర్సన్ ​అయ్యారు. తాండూరులోనూ కాంగ్రెస్​ చైర్​పర్సన్, వైస్ ​చైర్​పర్సన్ ​కుర్చీలను దక్కించుకుంది. 

వికారాబాద్: తాండూర్ లో 12వ వార్డు నుంచి గెలిచిన పట్లోళ్ల నీరజ చైర్​పర్సన్​గా, 29వ వార్డు నుంచి గెలిచిన అబ్దుల్ రజాక్ వైస్​ చైర్​పర్సన్​గా ఎన్నికయ్యారు.