డెహ్రాడూన్ లో కుప్పకూలిన బ్రిడ్జి

డెహ్రాడూన్ లో కుప్పకూలిన బ్రిడ్జి

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో డెహ్రాడూన్-రిషికేష్ హైవేలోని జఖాన్ నది దగ్గర ఉన్న  రాణి పొఖారి బ్రిడ్జి నీటి ప్రవాహం ధాటికి ఒక్క సారిగా కుప్ప కూలింది. బ్రిడ్జి కూలిన సమయంలో అక్కడి నుంచి వెళ్తున్న వాహనాలు నదిలో పడిపోయాయి. కొన్ని వాహనాలు ఆ నీటి ప్రవాహానికి కొట్టుకు పోయాయి.  అయితే, వాహనల్లోని జనం.. ప్రమాదాన్ని ముందే తెలుసుకుని వాహానాల్లోంచి  దిగి వంతెనపైకి చేరుకున్నారు. దీంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.