ఆటో డ్రైవర్ను స్టేషన్లో అప్పగించిన హిజ్రాలు
బాచుపల్లి, వెలుగు: ట్రాన్స్జెండర్పై ఓ ఆటోడ్రైవర్ అత్యాచారయత్నం చేసిన ఘటన బాచుపల్లి పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో బాచుపల్లి నుంచి ఐడీఏ బొల్లారం వెళ్లడానికి ఆటో ఎక్కగా.. డ్రైవర్ఆటోను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, అత్యాచారయత్నానికి పాల్పడ్డాడని ఓ ట్రాన్స్జెండర్ పోలీసులకు కంప్లైంట్ చేసింది.
అక్కడినుంచి తప్పించుకుని పారిపోయి వచ్చానని తెలిపింది. మరికొంతమందితో కలిసి బుధవారం ఉదయం ఆటోడ్రైవర్ మహేశ్ను పట్టుకుని బాచుపల్లి స్టేషన్లో అప్పగించింది. ఆటోడ్రైవర్పై కేసు నమోదుచేసుకుని పోలీసులు విచారిస్తున్నారు.