రేపిస్ట్​ రాజు గెటప్స్‌‌‌‌​ మారుస్తుండు

రేపిస్ట్​ రాజు గెటప్స్‌‌‌‌​ మారుస్తుండు

ఎల్బీనగర్​లో ఆటో చోరీ యత్నం... నాగోల్​లో మద్యం కొనుగోలు
ఉప్పల్​లో వైన్​షాపు వద్ద ఎర్ర తువాల.. ప్లాస్టిక్​ కవర్​ స్వాధీనం
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం అర్ధరాత్రి నుంచి స్పెషల్ ​ఆపరేషన్
1,500 సీసీ కెమెరా ఫుటేజీలను చెక్ చేసిన పోలీసులు


హైదరాబాద్, వెలుగు: రేపిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజు పోలీసులకు చిక్కకుండా గెటప్​మారుస్తూ.. తిరుగుతున్నాడు. మెడలో ఎర్ర తువాల, తలపై బ్లాక్ క్యాప్, చేతిలో ప్లాస్టిక్​క్యారీబ్యాగ్, తెల్ల మాస్కుపెట్టుకొని సైదాబాద్​సింగరేణి కాలనీలోని తన ఇంటి నుంచి బయటకు వెళ్లిన రాజు.. ఎల్బీనగర్​వెళ్లే సరికి తలపై క్యాప్, జుట్టుకు ఉన్న రబ్బర్​బ్యాండ్​తీసేసి గెటప్​మార్చేశాడు. అక్కడి నుంచి ఉప్పల్​రింగ్​రోడ్డు సమీపంలో ఓ వైన్​షాప్​వద్ద చేతిలో ఉన్న ప్లాస్టిక్​కవర్, మెడలో తువాల కూడా వదిలేశాడు. ఈ నేపథ్యంలోనే పోలీసులు నిందితుడు గెటప్​మారిస్తే ఎలా ఉంటాడనే ఉహా చిత్రాలు రిలీజ్​చేశారు. తలపై వెంట్రుకలు, గడ్డం తీసేస్తే ఉండే ఆకారాన్ని పోస్టర్లలో ప్రచురించి బస్టాండ్స్, మార్కెట్స్, వైన్స్, టెంపుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద అతికిస్తున్నారు. రాజు చేతిలోని కవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందులో దొరికిన కల్లు బాటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బుధవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
వరంగల్​మార్గంపై నిఘా..
దాదాపు1500 సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పరిశీలించిన తర్వాత రాజు గురువారం సైదాబాద్​సింగరేణి కాలనీ నుంచి శుక్రవారం నాటికి ఉప్పల్​రింగ్​రోడ్డు​చేరుకున్నట్లు గుర్తించిన పోలీసులు వరంగల్​మార్గంలో ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైవే లోని వైన్స్, హోటల్స్, ఇసుక లారీల అడ్డాలు, టెంపుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గాలించారు. ఘట్కెసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, యాదాద్రి భువనగిరి మార్గల్లో సీసీటీవీ ఫుటేజీ చెక్​చేస్తున్నారు. మరోవైపు రాజు సొంతూరైన అడ్డగూడురులో పోలీసులు మఫ్టీలో నిఘా పెట్టారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు మేడ్చల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,స్పెషల్ ఆపరేషన్ టీమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తనిఖీలు చేస్తున్నాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్​స్టేషన్ల పరిధిలో స్పెషల్​ఆపరేషన్​చేపట్టాలని పోలీసు ఉన్నతాధికారులు అన్ని స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు. 


సీసీటీవీ ఫుటేజీ.. రేపిస్ట్​ కదలికలు
ఈ నెల 9(గురువారం)న చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన రాజు.. అదే రోజు రాత్రి ఇంటికి తాళం వేసి మెడలో ఎర్ర తువాల, తలపై బ్లాక్ క్యాప్, చేతిలో ప్లాస్టిక్​క్యారీ బ్యాగ్, తెల్ల మాస్కుపెట్టుకొని సైదాబాద్​సింగరేణి కాలనీ నుంచి బయలుదేరాడు. ఈ నెల 10(శుక్రవారం)న వినాయక చవితి రోజు కాలినడకన ఎల్బీనగర్​చేరుకున్నాడు. ఎల్బీనగర్ టు ఉప్పల్​రింగ్​రోడ్డు మార్గంలో ఓ చిన్న ఆటోను చోరీ చేసే ప్రయత్నం చేశాడు. ఆటో డ్రైవర్​అలర్ట్​కావడంతో అప్పుడే అటువైపు వెళ్తున్న బస్సు ఎక్కాడు. నాగోల్​లో దిగిన రాజు అక్కడ ఓ వైన్​షాపులో మందు కొని తాగాడు. దాదాపు ఓ గంట పాటు అక్కడే తిరిగాడు. అక్కడి నుంచి ఉప్పల్​రింగ్​రోడ్డు వరకు చేరుకున్నాడు. అదే రోజు ఉప్పల్​రింగ్​రోడ్డు నుంచి వరంగల్​మార్గంలో ఓ వైన్​షాప్​వద్ద తిరిగాడు. చేతిలో ఉన్న కవర్, మెడపై ఉన్న ఎర్ర తువాల వైన్​షాప్​పక్కన పడేశాడు. కవర్​లో ఓ మద్యం సీసా(కల్లుబాటిల్) ఉంది. నిందితుడు చివరగా ఈ నెల10వ తేదీన 7.45 నిమిషాలకు ఉప్పల్​రింగ్​రోడ్డు వద్ద తిరిగాడు. అక్కడి నుంచి ఎటు వెళ్లాడనేదానిపై పోలీసులు గాలిస్తున్నారు.