అచ్చంపేట, వెలుగు: పట్టణంలోని మహాదేవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో శనివారం అరుదైన ఆపరేషన్ చేశారు. ఉప్పునుంతల మండలం తాడూరు గ్రామానికి చెందిన చంద్రకళ కొన్ని రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతుండగా, హాస్పిటల్ డాక్టర్ మహేశ్పరీక్షలు చేసి కడుపులో కణితి(ఒమెన్ టెక్టమీ) ఉందని గుర్తించారు. శనివారం ఆపరేషన్ చేసి కడుపులోని 8 కిలోల కణితిని తొలగించారు. జనరల్ సర్జన్ మహేశ్, సిబ్బంది వెంకట్రెడ్డి, భరత్, రాము, రాంలాల్ కణితిని తొలగించారు.
