ఆనంద్‌ మహీంద్రాకు అరుదైన గౌరవం

ఆనంద్‌ మహీంద్రాకు అరుదైన గౌరవం

ప్రముఖ బిజినెస్ మెన్లు మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా, అడోబ్‌ ఛైర్మన్‌, సీఈవో శంతను నారాయణ్‌ అరుదైన గౌరవం అందుకోనున్నారు. అమెరికా-భారత్‌ వ్యూహాత్మక భాగస్వామ్యం వేదిక (USISPF) వీరిని 2020 నాయకత్వ అవార్డ్స్ కు ఎంపిక చేసింది. రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చడంపై వీరికున్న దార్శనికతను ప్రశంసించింది. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి వీరిద్దరి పేర్లను ప్రకటించింది.

నేవిగేటింగ్‌ న్యూ ఛాలెంజెస్‌ క్రమంలో ఆగస్టు 31న  USISPF మూడో‌ వార్షిక నాయకత్వ సదస్సును ఏర్పాటు చేయనుంది. ఇది సెప్టెంబర్‌ 3న ముగుస్తుంది. 21 ఫార్చూన్‌ 500 కంపెనీల సీఈవోలు, ప్రభుత్వ సీనియర్‌ అధికారులు, రెండు దేశాల మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.