ఖమ్మం కార్పోరేషన్ బడ్జెట్ సమావేశంలో రసాబాసా

ఖమ్మం కార్పోరేషన్ బడ్జెట్ సమావేశంలో రసాబాసా

ఖమ్మం: జిల్లాలోని మున్సిపల్ కార్పోరేషన్ బడ్జెట్ సమావేశంలో గందరగోళం ఏర్పడింది. సమావేశంలో టీఆర్ఎస్ కార్పోరేటర్లు మాట్లాడుతుండగా ప్రతిపక్ష కార్పోరేటర్లు అడ్డుకున్నారు. అధికార పార్టీ కార్పోరేటర్లు ఉన్న డివిజన్ లోనే అభివృద్ధి చేస్తున్నారని.. విపక్ష కార్పోరేటర్లు ఉన్న డివిజన్ లో కనీసం సమస్యలు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. కాగా.. అన్ని డివిజన్లను ఒకేలా అభివృద్ధి చేస్తున్నామని, కేటీఆర్ చేతుల మీదుగా త్వరలోనే కొత్త మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ పనులు ప్రారంభిస్తామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.