కోలీవుడ్​లో రాశీ దూకుడు

కోలీవుడ్​లో రాశీ దూకుడు

సౌత్​ ఇండస్ట్రీలో సైలెంట్​గా పాగా వేస్తోంది రాశీ ఖన్నా. తమిళనాట వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. తాజాగా ఈ పాల బుగ్గల సుందరి మరో బంపర్​ ఆఫర్​ కొట్టేసింది. తమిళ లేడీ సూపర్​ స్టార్​ నయనతారను రాశీ రీప్లేస్​ చేసింది. కోలీవుడ్​లో వైనాత్​ శశికాంత్​ దర్శకత్వంలో ఓ హీరోయిన్​ ఓరియెంటెడ్​ సినిమా తెరకెక్కనుంది.

సిద్ధార్థ్​, మాధవ్​ ఇందులో లీడ్​ రోల్​ చేస్తున్నారు. నయనతార ప్రధాన పాత్రలో నటించాల్సి ఉంది. అయితే, కొన్ని కారణాల వల్ల నయన్​ ఈ ప్రాజెక్ట్​ నుంచి తప్పుకుంది. అయితే, ఈ స్టార్​ హీరోయిన్​ ప్లేస్​లో రాశీ బెస్ట్​ చాయిస్ అని మూవీ మేకర్స్​ ఫిక్స్​ అయ్యారట​. దీనిపై అఫీషియల్​ అనౌన్స్​మెంట్​ రావలసి ఉంది.

ఇటీవల కార్తీ ‘సర్దార్‘​ సినిమాలో మెరిసిన రాశీ.. ‘ఫర్జీ’ అనే వెబ్ సిరీస్​ తోనూ ఆకట్టుకుంది. షాహిద్​ కపూర్​, విజయ్​ సేతుపతి నటించిన ఈ సిరీస్​లో మేఘా వ్యాస్​ అనే ఆర్బీఐ అధికారిగా రాశీ మెప్పించింది.