
ఐపీఎల్ 2023 ఆరంభ వేడుకలు అదుర్స్ అనిపించాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఐపీఎల్ ప్రారంభ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. హీరోయిన్లు తమన్నా..రష్మికా..స్టెప్పులతో ఇరగదీశారు. బాలీవుడ్ సింగర్ అర్జిగ్ సింగ్..అద్భుత పాటలతో అభిమానుల్లో ఊపుతెచ్చాడు.
ఊ అంటావా మామా..
హీరోయిన్ తమన్నా ఐపీఎల్-2023 ఆరంభ వేడుకల్లో స్టెప్పులతో దుమ్మురేపింది. తన డ్యాన్స్తో అభిమానులను అలరించింది. టమ్ టమ్ అంటూ ట్రెండింగ్ సాంగ్ కు ఇరగదీసింది. పుష్ప సినిమాలోని ఊ అంటావా మామా అంటూ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించింది.
నాటు నాటు స్టెప్పులు..
పుష్ప మూవీతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిన రష్మిక మందన్నా..ఐపీఎల్ ప్రారంభ వేడుకల్లో సందడి చేసింది. పుష్ప సినిమాలోని సామీ సామీ సాంగ్ కు తనదైన శైలిలో డ్యాన్స్ చేస్తూ..అభిమానులను ఆకట్టుకుంది. అంతేకాదు..ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటుకు డ్యాన్సులతో వాహ్వా అనిపించింది. శ్రీవల్లి పాటతో పాటు గంగూభాయ్ కతియావాడీలోని డోలీడా పాటకు సూపర్ డ్యాన్స్ తో కేక పెట్టించింది.
వీరితో పాటు..బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్ ..హిందీ సాంగ్స్ తో అభిమానుల్లో మరింత ఊపు తెచ్చాడు. నటి మందిరా బేడి ఐపీఎల్ యాంకర్గా పునరాగమనం చేసింది. ఆరంభ వేడుకులకు హోస్ట్గా వ్యవహరించింది.
ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీకి బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా హాజరయ్యారు. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల అభిమానులతో నరేంద్ర మోదీ స్టేడియం పూర్తిగా నిండిపోయింది.