జపాన్‌‌‌‌లో చిల్ అవుతోన్న రష్మిక మందన్న

జపాన్‌‌‌‌లో చిల్ అవుతోన్న రష్మిక మందన్న

అరడజనుకుపైగా చిత్రాల్లో నటిస్తూ ఫుల్ ఫామ్‌‌‌‌లో ఉన్న  రష్మిక మందన్న ప్రస్తుతం జపాన్‌‌‌‌లో చిల్ అవుతోంది. టోక్యోలో జరిగిన ‘క్రంచీ రోల్ అనిమే’ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న ఆమె..  ఫ్యాన్స్‌‌‌‌కు థ్యాంక్స్ చెబుతూ ట్రెండీ కాస్ట్యూమ్స్‌‌‌‌తో ఉన్న తన ఫొటోలను షేర్ చేసింది. ‘జపాన్‌‌‌‌ వెళ్లాలని ఎన్నో ఏళ్లుగా కలలు కన్నా. ఇప్పుడు ఈ అవార్డుల కోసం రావడం చాలా ఆనందంగా ఉంది.  ఇక్కడి అభిమానుల  ప్రేమను పొందడం అదృష్టంగా భావిస్తున్నా. 

ఘన స్వాగతం అందుకోవడంతో పాటు ఇక్కడి ఆహారం, వాతావరణం, పరిశుభ్రంగా ఉండే ప్రదేశం చూస్తుంటే.. అమేజింగ్‌‌‌‌గా అనిపిస్తుంది. ఇకపై ప్రతి ఏడాది జపాన్‌‌‌‌కు వస్తా’ అంటూ రాసుకొచ్చింది. ఈ సందర్భంగా పోస్ట్ చేసిన ఫొటోల్లో క్లివేజ్ షోతో యూత్‌‌‌‌ను ఆకట్టుకుంటుంది.  ఇక రష్మిక ప్రస్తుతం  తెలుగులో  పుష్ప2 చిత్రంలో నటిస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న షూటింగ్‌‌‌‌లో త్వరలో ఆమె పాల్గొనబోతోంది. పుష్పరాజ్‌‌‌‌ భార్యగా శ్రీవల్లి పాత్రలో ఆమె కనిపించనుంది.  ఆగస్టు 15న సినిమా విడుదల కానుంది. మరోవైపు  రెయిన్ బో, ది గర్ల్ ఫ్రెండ్  చిత్రాల్లో ఫిమేల్ లీడ్‌‌‌‌గా నటిస్తోంది. అలాగే హిందీలో ‘ఛవా’ చిత్రం చేస్తోంది. ఇంకా మరికొన్ని ప్రాజెక్టులు  లైన్‌లో ఉన్నాయి.