సౌందర్య బయోపిక్.. ఆసక్తికర కామెంట్స్ చేసిన రష్మిక

సౌందర్య బయోపిక్.. ఆసక్తికర కామెంట్స్ చేసిన రష్మిక

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. తమ తమ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారి జీవిత చరిత్రలను సినిమాల రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అనేది కొత్తేమి కాదు. ఇండియా వైడ్ గా అలాంటి బయోపిక్ లు చాలానే వచ్చాయి. వాటిని ప్రేక్షకులు ఆదరించారు కూడా. ఇక తెలుగు విషయానికి వస్తే.. మహానటి, ఎన్టీఆర్(కథానాయకుడు), ఎన్టీఆర్(మహానాయకుడు) వంటి సినిమాలు అలా వచ్చినవే. నటీనటులు కూడా ఇలాంటి సినిమాల్లో కనిపించేందుకు ఇష్టపడుతూ ఉంటారు. తాజాగా బయోపిక్ సినిమాలపై నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన స్పందనని తెలిపారు. 

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె బయోపిక్ ల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. నేను సినీ ఇండస్ట్రీకి రాకముందు మా నాన్న నన్ను సౌందర్య గారిలా ఉంటాను అనేవారు. ఒకవేళ అది నిజమైతే నాకు సౌందర్యగారి బయోపిక్ లో నటించాలని ఉంది. ఆమె అన్నా, ఆమె నటన అన్నా, ఆమె జర్నీ అన్నా నాకు చాలా ఇష్టం.. అంటూ చెప్పుకొచ్చాడు రష్మిక.

తాజాగా రష్మిక చేసిన కామెంట్స్ తో మరోసారి సౌందర్య బయోపిక్ తెరపైకి వచ్చింది. నిజానికి చాలా కాలం క్రితమే సౌందర్య బయోపిక్ రానుంది అనే వార్తలు వినిపించాయి. కానీ, అవి రూమర్స్ గానే మిగిలిపోయాయి. ఆడియన్స్ కూడా సౌందర్య బయోపిక్ చూసేందుకు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరి ఇప్పుడు రష్మిక చేసిన కామెంట్స్ తో ఎవరైనా ఆ సినిమాను తెరకెక్కించే భాధ్యతను తీసుకుంటారా అనేది చూడాలి.