‘సీతారామం’తో ఈ ఏడాది సూపర్ సక్సెస్ను అందుకున్న రష్మిక మందాన్న.. సంక్రాంతికి ‘వారసుడు’ చిత్రంతో ఇటు తెలుగు, అటు తమిళ ప్రేక్షకుల ముందుకొస్తోంది. జనవరి 12న ఈ చిత్రం విడుదల కానుండగా.. అదే నెలలో రష్మిక నటించిన మరో సినిమా రిలీజ్కు రెడీ అవుతోంది. అదే ‘మిషన్ మజ్ను’. బాలీవుడ్లో రష్మిక సైన్ చేసిన మొదటి సినిమా ఇది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ను శంతను బగ్చి డైరెక్ట్ చేశాడు. 1970లో సీక్రెట్ మిషన్ కోసం పాకిస్థాన్ వెళ్లే రా ఏజెంట్గా సిద్ధార్థ్ నటించాడు.
రష్మిక కూడా సీక్రెట్ ఏజెంట్గా నటించినట్టు తెలుస్తోంది. రోనీ స్ర్కూవాలా, అమర్ బుటాలా, గరిమ మెహతా నిర్మిస్తు న్నారు. మొదట మే నెలలో రిలీజ్కు ప్లాన్ చేశారు. కానీ కొవిడ్ కారణా లతో వెనక్కి తగ్గారు. ఈలోపు రష్మిక నటించిన రెండో సినిమా ‘గుడ్ బై’ విడుద లైంది. ఎట్టకేలకు ‘మిషన్ మజ్ను’ రిలీజ్ డేట్ను ఫైనల్ చేశారు మేకర్స్. జనవరి 20న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే థియేటర్స్ కోసం తీసిన ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తున్నారు. నెట్ ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు హిందీ చిత్రం ‘యానిమల్’లో నటిస్తోన్న రష్మిక.. ప్యాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2’లో అల్లు అర్జున్కి జంటగా నటిస్తోంది.