కశ్మీరి ముస్లిం అమ్మాయిగా రష్మిక

కశ్మీరి ముస్లిం అమ్మాయిగా రష్మిక

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్‌లు కలిసి నటిస్తోన్న చిత్రం 'సీతారామం'. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని స్వప్న సినిమాస్ అశ్వినీదత్, ప్రియాంక దత్ కలిసి నిర్మిస్తున్నారు.  తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 5న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన కీరో ల్ ప్లే చేస్తుంది. ఈ రోజు బక్రీద్ సందర్భంగా సినిమాలో ఆమె సంబంధించిన లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో ఆమె అఫ్రీన్ అనే కశ్మీరి ముస్లిం అమ్మాయిగా కనిపించనుంది.  హిజాబ్ ధరించిన ఆమె లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో అక్కినేని హీరో సుమంత్ కూడా కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు. పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ సినిమా పైన అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.