పుష్ప చిత్రంతో ఫుల్ ఫామ్లో ఉన్న రష్మిక మందన్న, వరుస సినిమాలతో బిజీగా ఉంది. మరోవైపు ట్రెండీ కాస్ట్యూమ్స్తో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇటలీలోని మిలాన్ నగరంలో జరుగుతున్న ఫ్యాషన్ షోలో రష్మిక పాల్గొంది. జపనీస్ ఫ్యాషన్ లేబుల్ ‘ఒనిత్సుకా టైగర్’కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న ఆమె.. ఈ బ్రాండ్ తరఫున ర్యాంప్ వాక్ చేసింది.
బ్లాక్ కాస్ట్యూమ్స్, షార్ట్ హెయిర్ స్టైల్తో కనిపిస్తున్న రష్మిక ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫిబ్రవరి 20 న మొదలైన ఈ ఫ్యాషన్ వీక్ ఈనెల 26 వరకు జరుగనుంది. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్కు జంటగా ‘పుష్ప 2’లో నటిస్తున్న ఆమె, మరోవైపు తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’, అలాగే ‘రెయిన్ బో’ సినిమాలో నటిస్తోంది.