మరో రెండు కొత్త ప్రాజెక్టులకు ఆమె గ్రీన్ సిగ్నల్

మరో రెండు కొత్త ప్రాజెక్టులకు ఆమె గ్రీన్ సిగ్నల్

సౌత్ ఇండస్ట్రీతో పాటు అటు బాలీవుడ్‌‌‌‌లోనూ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది రష్మిక మందన్న. ప్రస్తుతం అల్లు అర్జున్‌‌‌‌కు జంటగా ‘పుష్ప 2: ది రూల్‌‌‌‌’, ధనుష్‌‌‌‌తో ‘కుబేర’ చిత్రాల్లో నటిస్తున్న ఆమె.. మరోవైపు  రెయిన్ బో, ది గర్ల్‌‌‌‌ ఫ్రెండ్, చావా లాంటి చిత్రాల్లో నటిస్తోంది.  అలాగే ‘సికందర్‌‌‌‌‌‌‌‌’లో సల్మాన్‌‌‌‌కు జంటగా కనిపించనుంది. తాజాగా మరో రెండు కొత్త ప్రాజెక్టులకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

తమిళ హీరో శివ కార్తికేయన్‌‌‌‌కు జంటగా ఓ సినిమా చేయబోతోందట.  ‘డాన్‌‌‌‌’ కాంబినేషన్‌‌‌‌ రిపీట్ చేస్తూ సీబీ చక్రవర్తి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు శివ కార్తికేయన్. ఎస్‌‌‌‌.జె.సూర్య ఇందులో కీలకపాత్ర పోషించనుండగా.. హీరోయిన్‌‌‌‌గా రష్మికను సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఆయుష్మాన్‌‌‌‌ ఖురానా హీరోగా తెరకెక్కబోయే ‘వాంపైర్స్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ విజయ్‌‌‌‌నగర్‌‌‌‌’ అనే హారర్ మూవీలోనూ హీరోయిన్‌‌‌‌గా రష్మికను తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.  ఆదిత్య సత్పోదర్‌‌‌‌ డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రాన్ని స్త్రీ, భేడియా లాంటి హారర్ థ్రిల్లర్స్‌‌‌‌ నిర్మించిన దినేష్ విజన్ ప్రొడ్యూస్ చేయనున్నారు. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక ఖాతాలో మరో రెండు సినిమాలు చేరబోతున్నాయి.