
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఆమె మేనేజర్ చేతిలో మోసపోయిందని ఇటీవల వార్తలు గుప్పుమన్నాయి. తనను నమ్మించి రూ. 80 లక్షల మేర మోసం చేశాడని.. విషయం పెద్దది చేయడం ఇష్టంలేక కేసు కూడా పెట్టకుండా వదిలేసిందని టాక్. కానీ, ఈ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్లో ‘యానిమల్’ సినిమాతో బిజీగా ఉన్న రష్మిక స్నేహపూర్వకంగానే మేనేజర్తో విడిపోయిందని ఆమె సన్నిహిత వర్గాలు అంటున్నాయి.
ముంబైకి చెందిన ఓ ఏజెన్సీనే ప్రస్తుతం ఈ హీరోయిన్ డేట్స్ చూసుకుంటుంది. ఇక మరో మేనేజర్ అవసరం లేకనే అతడిని పక్కన పెట్టినట్టు సమాచారం. అతడు కూడా టాలీవుడ్లో మరో కీలక నటుడి దగ్గర పనిచేస్తూ బిజీగా ఉన్నాడట. ఇందులో నిజమెంతో తెలియాలంటే రష్మిక ఈ వార్తలపై స్పందించాల్సిందే. ఇక ఈ బ్యూటీ త్వరలోనే ‘పుష్ప 2’ సెట్స్లో జాయన్ కానుంది.