వైభవంగా రథసప్తమి వేడుకలు.. ఏడు వాహనాలపై విహరించిన సూర్య నారాయణుడు

వైభవంగా రథసప్తమి వేడుకలు.. ఏడు వాహనాలపై విహరించిన సూర్య నారాయణుడు

తెలుగు రాష్ట్రాల్లో రథసమస్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుతున్నాయి. సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి 16న తిరుమలలో రథ సప్తమి వేడుకలు నిర్వహిస్తున్నారు. రథసప్తమి సందర్భంగా ఆలయాలన్ని కిటకిటలాడుతున్నాయి. రథసప్తమి వేడుకల్లో భాగంగా ప్రధమ వాహనంగా సూర్య నారాయణుడు సూర్య ప్రభామధ్యస్తుడై దివ్యకిరణ కాంతుల్లో ప్రకాశిస్తూ.. సూర్యప్రభ వాహనంలో దర్శనమిచ్చారు. సూర్యుడు సకల రోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు.

ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే కావడంతో సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని పురాణాలూ పేర్కొంటున్నాయి.

వేకువజామునే దర్శనాలు..

ఉదయం 5:30 గంటలకు సూర్యప్రభ వాహనసేవ మొదలైంది. అక్కడి నుండి ఆలయ వాయువ్య దిక్కుకు చేరుకున్నారు శ్రీవారు. సూర్యోదయాన భానుడి తొలికిరణాలు శ్రీ మలయప్ప స్వామి వారి పాదాలను స్పృశించాయి. ఈ ఘట్టంను కనులారా తికలించిన భక్తులు తన్మయత్వంలో మునిగిపోయారు.

ఆలయ మాడవీధులంతా గోవిందా అనామ స్మరణతో మారుమ్రోగింది. అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి హారతి సమర్పించారు. అదే సమయంలో గ్యాలరీల్లో వేచివున్న భక్తులు గోవిందనామ స్మరణలతో స్వామి వారిని దర్శించి అపూర్వంగా భావిస్తారు. ఇక 108 సార్లు ఆదిత్య హృదయం పిల్లల చే పఠించడం అనవాయితీగా వస్తుంది

తిరుమలలో స్వామివారు ఏడు వాహనాలపై ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తున్నారు. మాఘ మాసంలో వచ్చే శుక్ల పక్ష సప్తమి తిథిని రథ సప్తమి లేదా మాఘ సప్తమి అంటారు. వేదాల ప్రకారం, శ్రీ సూర్యదేవుడు ఈ పవిత్రమైన రోజున జన్మించాడు. ప్రపంచానికి జ్ఞానాన్ని ఇచ్చాడు. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలకు భారీగా తరలివచ్చే భక్తుల కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. రథసప్తమిని మినీ బ్రహ్మోత్సవాలు అని కూడా అంటారు.

వాహన సేవలు

  • ఉదయం 5.30 నుండి 8 వరకు (సూర్యోదయం ఉదయం 6.40 గంటలకు) – సూర్య ప్రభ వాహనం
  • ఉదయం 9 నుంచి 10 గంటల వరకు – చిన్నశేష వాహనం
  • ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు – గరుడ వాహనంఔ
  • మధ్యాహ్నం 1 నుండి 2 వరకు – హనుమాన్ వాహనం
  • మధ్యాహ్నం 2 నుండి 3 వరకు – చక్ర స్నానం
  • సాయంత్రం 4 నుండి 5 వరకు – కల్ప వృక్ష వాహనం
  • సాయంత్రం 6 నుంచి 7 వరకు – సర్వభూపాల వాహనం
  •  రాత్రి 8 నుంచి 9 గంటల వరకు – చంద్రప్రభ వాహనం

తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు  ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేసింది. సుప్రబాతం, తోమాల, అర్చన ఏకాంతంగా నిర్వహిస్తారు.

తిరుమల శ్రీవారి దర్శనం కోసం విచక్షణ కోటాలో కేటాయించిన బ్రేక్ దర్శనం టిక్కెట్లను పొందుతున్న భక్తుల సౌకర్యార్థం TTD ఇటీవల SMS చెల్లింపు విధానాన్ని కొత్తగా ప్రవేశపెట్టింది. కొత్త విధానంలో, చెల్లింపు లింక్ SMS ద్వారా సెల్ ఫోన్ లకు పంపనున్నారు. భక్తులు ఆ లింక్‌పై క్లిక్ చేసి UPI లేదా క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు.  MBC-34 కౌంటర్‌కు వెళ్లకుండా బ్రేక్ దర్శన్ టిక్కెట్‌ల ప్రింటవుట్ తీసుకోవచ్చు. ఇప్పటికే CROలో లక్కీడిప్ ఆఫ్‌లైన్ ద్వారా సంపాదించిన సేవాటికెట్లను పొందుతున్న భక్తుల కోసం ఈ విధానం అమలుకానుంది.

Also read : ఆర్మూర్ సిద్ధులగుట్ట శివరాత్రి ఉత్సవ కమిటీ ఏర్పాటు : పొద్దుటూరి వినయ్ రెడ్డి

అటు జగిత్యాల జిల్లా ధర్మపురి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుతున్నాయి. దక్షిణ కాశిగా పేరొందిన జగిత్యాల జిల్లా ధర్మపురి గోదావరిలో రథసప్తమి సందర్భాంగా భక్తుల తాకిడి పెరిగింది. శ్రీ లక్ష్మీనరసింహ స్వామీ దేవాలయంల అనుబందాలయమైన ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాఘ శుద్ధ సప్తమిని సకల చరాచర జీవరాసుల ప్రాణ ప్రదాతయైన సూర్యభగవానుని జన్మదినంగా భావిస్తారు. ఈరోజు వేకువ జామునే సూర్యుడు ఉదయించే స్నానమాచరించి సూర్య భగవాన్ కి నమస్కారం చేస్తే సకల ఆయురారోగ్యాలు ఉంటాయని వేద పండితులు తెలిపారు. ఈ సందర్బంగా ధర్మపురి క్షేత్ర గోదావరిలో స్నానం ఆచరించిన భక్తులు  నృసింహుని దర్శించుకున్నారు.