రెసిడెన్షియల్ స్కూల్‌లో స్టూడెంట్స్‌ను కరిచిన ఎలుకలు

రెసిడెన్షియల్ స్కూల్‌లో  స్టూడెంట్స్‌ను కరిచిన ఎలుకలు
  • నర్సాపూర్​ గురుకులంలో ఘటన
  • ఎవరికీ చెప్పొద్దని టీచర్లు భయపెట్టారన్న పేరెంట్స్​

నర్సాపూర్, వెలుగు: మెదక్​జిల్లా నర్సాపూర్ ​పట్టణంలోని అల్లూరి సీతారామరాజు ట్రైబల్ వెల్ఫేర్ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్​లో విద్యార్థులను ఎలుకలు కరిచాయి. 6వ తరగతి చదువుతున్న చిలప్​చెడ్​ మండలం గౌతాపూర్​కు చెందిన కిరణ్ కుమార్, హైదరాబాద్​కు చెందిన ప్రశాంత్, వికారాబాద్​కు చెందిన విశాల్.. ఆదివారం రాత్రి తమ రూంలో నిద్రపోగా.. ముగ్గురినీ ఎలుకలు కరిచాయి. సోమవారం కిరణ్​కుమార్ తన తండ్రి రాజుకు ఫోన్​ చేసి విషయం చెప్పాడు. దీంతో రాజు రాత్రి వరకు స్కూల్​కు వచ్చి కిరణ్​కుమార్​ను నర్సాపూర్​ప్రభుత్వ ఏరియా హాస్పిటల్​కు తీసుకెళ్లి ట్రీట్​మెంట్​ చేయించారు. 

విశాల్, ప్రశాంత్​కూడా తమ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు కూడా వచ్చి హాస్పిటల్​లో జాయిన్​ చేయించారు. ముగ్గురు స్టూడెంట్స్​ను ఎలుకలు కరిచాయని తెలుసుకున్న మిగతా విద్యార్థులు భయపడుతున్నారు. కాగా, ఎలుకలు కరిచిన విషయాన్ని బయట ఎవరికీ చెప్పొద్దని టీచర్లు, ప్రిన్సిపాల్ స్టూడెంట్స్​ను​భయపెడుతున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు.