రవితేజ పర్ఫెక్ట్ ప్లానింగ్

రవితేజ పర్ఫెక్ట్ ప్లానింగ్

గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసే హీరోల్లో ముందు వరుసలో ఉంటాడు రవితేజ. ఏడాదికి రెండు, మూడు చిత్రాల్లో నటిస్తూ ఎప్పుడూ బిజీగా ఉండే ఆయన.. పర్ఫెక్ట్ ప్లానింగ్‌‌‌‌‌‌‌‌తో ఒక్కో సినిమాని పూర్తి చేస్తూ ముందుకెళ్తున్నాడు. 

ప్రస్తుతం ‘టైగర్ నాగేశ్వరరావు’తోపాటు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఈగిల్’ చిత్రంలోనూ నటిస్తున్నాడు. ఈ రెండూ దాదాపు షూటింగ్ పూర్తయ్యాయి. ‘ఈగిల్’ బ్యాలెన్స్ షూట్ కోసం రవితేజ లండన్‌‌కు వెళ్తున్నట్టు తెలిసింది. 

దీంతో మొత్తం షూటింగ్ పూర్తవనుందట. ‘టైగర్ నాగేశ్వరరావు’ దసరా సందర్భంగా అక్టోబర్ 20న విడుదల అవుతుంటే.. ‘ఈగిల్’ చిత్రాన్ని సంక్రాంతి రేసులో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. మరోవైపు వచ్చే నెల నుంచి గోపీచంద్ మలినేని డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లో తెరకెక్కనున్న సినిమాని మొదలు పెట్టనున్నారు. వీరిద్దరి కాంబోలో రానున్న నాలుగో చిత్రమిది.  మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది.