న్యూఢిల్లీ: ఖాతాదారులు కేవైసీ వివరాలను అప్డేట్ చేయడానికి ఇకపై తమ బ్యాంకు శాఖలను సందర్శించాల్సిన అవసరం లేదని, సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే చాలని ఆర్బీఐ తెలిపింది. ఇప్పటికే అవసరమైన పత్రాలను ఇచ్చి ఉండి, చిరునామాను మార్చుకోనివారికి మాత్రమే ఈ సదుపాయం ఉంటుంది. కేవైసీ సమాచారంలో మార్పు లేకుంటే, ఈ–మెయిల్- ఐడీ, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఏటీఎంలు లేదా ఏదైనా ఇతర డిజిటల్ ఛానెల్ల ద్వారా సెల్ఫ్ డిక్లరేషన్ను సమర్పించవచ్చు. కేవైసీ అప్డేషన్ కోసం బ్యాంకులు బ్రాంచ్కు రావాలని కోసం పట్టుబట్టరాదని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు.
సెంట్రల్ బ్యాంక్ దీనికి సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసింది. కేవైసీ సమాచారంలో కొత్త మార్పులు అవసరం లేదనుకుంటే సెల్ఫ్ డిక్లరేషన్ సరిపోతుందని తెలిపింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ అప్లికేషన్ , లెటర్ ద్వారా కూడా సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వవచ్చు. చిరునామాలో మార్పు మాత్రమే ఉన్నట్లయితే, కస్టమర్లు ఈ ఛానెల్స్లో దేని ద్వారానైనా కొత్త దానిని అందించవచ్చు. రెండు నెలల్లోగా చిరునామాను బ్యాంక్ మారుస్తుంది. బ్యాంక్ రికార్డులలో అందుబాటులో ఉన్న కేవైసీ పత్రాలు చెల్లకపోతే మాత్రమే కొత్త కేవైసీ అవసరం. ఇలాంటి వాళ్లు -- పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్, ఓటరు గుర్తింపు కార్డు, ఎన్ఆర్ఈజీఏ జాబ్ కార్డ్ వంటివి అందజేసి కేవైసీ పనిని పూర్తి చేయవచ్చు. ఇదివరకు సమర్పించిన కేవైసీ డాక్యుమెంట్చెల్లుబాటు గడువు ముగిసిన సందర్భాల్లో కూడా కొత్తవి ఇవ్వాలి. కొత్త కేవైసీ పనిని బ్యాంక్ బ్రాంచ్ని సందర్శించడం ద్వారా లేదా వీడియో ఆధారిత కస్టమర్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ ద్వారా రిమోట్గా చేయవచ్చు అని ఆర్బీఐ పేర్కొంది.