న్యూఢిల్లీ: రెగ్యులేటరీ రూల్స్ను ఉల్లంఘించినందుకు స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), కెనరా బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్లకు దాదాపు రూ.3 కోట్ల జరిమానా విధించినట్లు ఆర్బీఐ వెల్లడించింది. డిపాజిటర్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఫండ్ స్కీమ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఎస్బీఐకి రూ. 2 కోట్ల పెనాల్టీ విధించింది.
నో యువర్ కస్టమర్(కేవైసీ) గురించి ఆర్బీఐ జారీ చేసిన కొన్ని ఆదేశాలను పాటించనందుకు సిటీ యూనియన్ బ్యాంక్ లిమిటెడ్పై రూ. 66 లక్షల జరిమానా పడింది. కొన్ని ఆదేశాలను పాటించనందుకు కెనరా బ్యాంక్పై రూ.32.30 లక్షల జరిమానా విధించినట్టు ఆర్బీఐ పేర్కొంది.