న్యూఢిల్లీ: పేటీఎంపై రెగ్యులేటరీ చర్యలు తీసుకున్నప్పటికీ, 80–-85 శాతం పేటీఎం వాలెట్ వినియోగదారులకు ఇబ్బంది ఉండబోదని ఆర్బీఐ తెలిపింది. పేటీఎం బ్యాంక్ వినియోగదారులు తమ ఖాతాను ఇతర బ్యాంకుల ఖాతాలతో లింక్ చేసుకోవాలని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం సూచించారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ డిపాజిట్లు, క్రెడిట్ లావాదేవీలు, వాలెట్లలో టాప్-అప్లను చేయకుండా ఆర్బీఐ ఈ ఏడాది జనవరి 31న నిషేధించింది.
నియమాలను పాటించకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. పీపీబీఎల్ వాలెట్లను ఇతర బ్యాంకులతో లింక్ చేయడానికి ఈ నెల 15 వరకు గడువు ఇచ్చింది. మరోసారి గడువును పెంచబోని స్పష్టం చేసింది.