RCB vs RR: 59 పరుగులకే రాజస్థాన్ ఆలౌట్..ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ

RCB vs RR: 59 పరుగులకే రాజస్థాన్ ఆలౌట్..ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ

డూ ఆర్ డై మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చెలరేగింది. బ్యాటింగ్ లోనూ, బౌలింగ్ లోనూ  ఆల్ రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టింది. బెంగళూరు బౌలర్లు రాజస్థాన్ ను చిత్తు చేశారు. వచ్చిన బ్యాట్స్ మెన్ ను వచ్చినట్టుగానే పెవిలియన్ కు పంపారు. 112 పరుగుల తేడాతో గెలిచి ఐపీఎల్ లో భారీ విజయాన్ని సాధించారు.

రాజస్థాన్ తో  జరిగిన  మ్యాచ్లో  రాయల్ ఛాలెంజర్స్  బెంగళూరు  ఘన విజయం సాధించింది. 112 పరుగుల తేడాతో రాజస్థాన్ ను చిత్తు చేసింది. 172 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన రాజస్థాన్ ను 10.3 ఓవర్లలో 59 పరుగులకే ఆలౌట్ చేసింది.  జో రూట్  10, హెట్ మేయర్ 35 పరుగులు మినహా  రాజస్థాన్ ఓపెనర్లు  యశస్వీ జైశ్వాల్, జో బట్లర్  సహా  నలుగురు బ్యాటర్లు డకౌట్ కావడం విశేషం. బెంగళూరు బౌలర్లలో  పార్నెల్ 3, బ్రాస్ వెల్, శర్మలకు చెరో 2 వికెట్లు,  మహమ్మద్ సిరాజ్, మాక్స్ వెల్ లకు చెరో ఒక వికెట్ పడ్డాయి. 

అంతకుముంద టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఓపెనర్ కోహ్లీ 18 పరుగులు చేయగా..డుప్లెసిస్ 55, మాక్స్ వెల్ 54 పరుగులతో చెలరేగారు.  అనుజ్ రావత్ చివర్లో  11బంతుల్లో 29 పరుగులు చేయడంతో  బెంగళూరు 20 ఓవర్లలో 171 పరుగులు చేయగల్గింది. రాజస్థాన్ బౌలర్లలో అడమ్ జంపా, కేఎం ఆసీఫ్ లకు చెరో 2 వికెట్లు,  సందీఫ్ శర్మకు ఒక వికెట్ పడ్డాయి.