ధర్మం కోసం ప్రాణ త్యాగానికి సిద్ధం: రాజాసింగ్

ధర్మం కోసం ప్రాణ త్యాగానికి సిద్ధం:  రాజాసింగ్

ధర్మం కోసం ప్రాణ త్యాగానికి సిద్ధమని, భయపడేదే లేదని గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ప్రకటించారు. దీనికి తెలంగాణ ప్రజలు ఆశీర్వాదం కావాలని రాజా సింగ్ విజ్ఞప్తి చేశారు. బెదిరింపు కాల్స్, మెసేజ్ లపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా డీజీపీ పట్టించుకోవటం లేదని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ లీడర్స్ మూవ్ మెంట్స్ గురించి తెలుసుకోవటం కోసం ప్రభుత్వం కమాండ్ కంట్రోల్ రూం నిర్మించిందన్న రాజా సింగ్.. ఎమ్మెల్యేనైన తన పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. ఎంఐఎం ఒత్తిడి వల్లే బెదిరింపు కాల్స్ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆరోపణలు చేశారు. పాతబస్తీలో ఉగ్రవాదులకు ఎంఐఎం ఆర్థికసాయం చేస్తోందని రాజా సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టెర్రరిస్టులను అరెస్ట్ చేస్తే.. ధర్నాలు చేసిన చరిత్ర ఎంఐఎంకు ఉందన్న ఎమ్మెల్యే... తనకు బెదిరింపు మెసేజ్ లు చేస్తోన్న  వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. చంపేస్తామంటూ నాలుగైదు రోజులుగా వరుస మెసేజ్ లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.